News July 12, 2024

‘సుప్రీం’కు 75 ఏళ్ల సందర్భంగా రూ.75 వెండి నాణెం

image

సుప్రీం కోర్టు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రూ.75 వెండినాణెం విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 40 గ్రాముల బరువుండే నాణెం, 99.9 శాతం వెండితో తయారవుతుంది. ఒకవైపు అశోక స్తూపం, మరోవైపు సుప్రీం కోర్టు చిత్రాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Similar News

News October 28, 2025

వాట్సాప్ నుంచి గ్యాస్ బుక్ చేయొచ్చు!

image

LPG సిలిండర్‌ను వాట్సాప్‌లోనూ బుక్ చేసుకోవచ్చు. భారత్ గ్యాస్, Indane, HP గ్యాస్ కస్టమర్‌లు తమ రిజిస్టర్డ్ నంబర్ నుంచి కంపెనీ అధికారిక వాట్సాప్ నంబర్‌కు “Hi” లేదా “REFILL” అని మెసేజ్ చేస్తే చాలు. ఈ 24×7 సేవ ద్వారా తక్షణ బుకింగ్ కన్ఫర్మేషన్, డెలివరీ ట్రాకింగ్, చెల్లింపు సౌకర్యాలు లభిస్తాయి. Bharat- 1800 22 4344, Indane- 75888 88824, HP Gas -92222 01122 నంబర్లకు వాట్సాప్ చేయొచ్చు. SHARE IT

News October 28, 2025

బొట్టు ఎందుకు పెట్టుకోవాలి?

image

బొట్టు పెట్టుకోవడం అలంకరణ మాత్రమే కాదు. దీని వెనుక శాస్త్రీయ కారణాలున్నాయి. కనుబొమ్మల నడుమ ఖాళీ స్థలాన్ని ఆజ్ఞ చక్రం అంటారు. ఇది శరీరంలో ముఖ్యమైన నాడీ కేంద్రం. ఇక్కడ తిలకం దిద్దితే ఆజ్ఞ చక్రం ఉత్తేజితమై ముఖ కండరాల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మనసును శాంతంగా ఉంచి, సానుకూల శక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది.
☞ రోజూ ఆధ్యాత్మిక సమాచారం, ధర్మసందేహాల నివృత్తి కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News October 28, 2025

కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై CBN భేటీ

image

AP: రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉపసంఘంతో CM CBN సమీక్ష చేపట్టారు. గతంలో జరిగిన అశాస్త్రీయ విభజనతో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించే పలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు. పునర్విభజనలో ప్రస్తుత కొన్ని జిల్లాల భౌగోళిక సరిహద్దులను మార్పు చేయనున్నారు. నేతలు, సంఘాల వినతి మేరకు కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై చర్చిస్తున్నారు. Dy CM పవన్ కళ్యాణ్, మంత్రులు భేటీలో పాల్గొన్నారు.