News November 20, 2024
చిన్న దేశమే.. కానీ భారత్కు కీలకం!

దక్షిణ అమెరికాలోని ఉత్తర తీరంలో ఉన్న ఓ చిన్న దేశం గయానా. అవడానికి చిన్న దేశమే కానీ ద్వైపాక్షికంగా భారత్కు చాలా కీలకంగా మారింది. ఆ దేశంలో చమురు, సహజవాయువుల నిక్షేపాలు బయటపడటమే దీనిక్కారణం. ఈ నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు ఇర్ఫాన్ అలీతో ప్రధాని మోదీ సన్నిహిత సంబంధాలను మెయింటెయిన్ చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ చమురు లభ్యతపై ఆధారపడిన నేపథ్యంలో గయానాతో స్నేహంపై భారత్ ప్రత్యేకంగా దృష్టి సారించింది.
Similar News
News December 16, 2025
‘నేను చనిపోతే నా ఫ్యామిలీని చూసుకో’

ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్లో కాల్పులు జరుపుతున్న టెర్రరిస్టులను ధైర్యంగా <<18564673>>అడ్డుకున్న<<>> అహ్మద్ ప్రస్తుతం బుల్లెట్ గాయాల నుంచి కోలుకుంటున్నారు. ఆ రోజు జరిగిన సంఘటనను అతని బంధువు ముస్తఫా మీడియాకు వెల్లడించారు. ‘నేను ఉగ్రవాదిని అడ్డుకోవడానికి వెళ్తున్నా. నేను చనిపోతే నా ఫ్యామిలీని చూసుకో’ అని చెప్పి అహ్మద్ వెళ్లాడని తెలిపారు. తన కొడుకు నిజమైన హీరో అని, అతనిని చూసి గర్విస్తున్నట్లు తండ్రి చెప్పారు.
News December 16, 2025
BBCపై పరువునష్టం దావా వేస్తా: ట్రంప్

ప్రముఖ మీడియా సంస్థ BBCపై పరువునష్టం దావా వేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గత అధ్యక్ష ఎన్నికల సమయంలో 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ ఘటనకు ముందు చేసిన తన ప్రసంగాన్ని BBC తప్పుడు అర్థం వచ్చేలా ప్రసారం చేసిందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బీబీసీ ఛైర్మన్ సమీర్ షా ఖండిస్తూ ట్రంప్కు క్షమాపణ లేఖ పంపారు. గతంలోనూ పలు మీడియా సంస్థలపై ట్రంప్ పరువునష్టం దావా వేశారు.
News December 16, 2025
బాలయ్య నోట మరో పాట.. సాహోరే బాహుబలి తరహాలో!

నందమూరి బాలకృష్ణ తన తర్వాతి సినిమా కోసం మరోసారి సింగర్గా మారబోతున్నారు. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వెల్లడించారు. సాహోరే బాహుబలి సాంగ్ తరహాలో ఈ పాట ఉంటుందని తెలిపారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ మూవీ రాబోతోంది. కాగా బాలయ్య గతంలో ‘పైసా వసూల్’ సినిమాలో ‘మామా ఏక్ పెగ్ లా’ అనే సాంగ్ పాడారు. అప్పుడప్పుడూ మూవీ ఈవెంట్లలోనూ ఆయన తన సాంగ్స్ పాడి ప్రేక్షకులను అలరిస్తుంటారు.


