News September 21, 2024

ఒత్తిడితో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య!

image

పుణేలో ఓ CA ఒత్తిడితో సూసైడ్ చేసుకున్న ఘటన మరువక ముందే చెన్నైలో కార్తికేయన్ అనే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్(38) ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెనీ ప్రాంతానికి చెందిన ఆయన కుటుంబంతో సహా చెన్నైలో ఉంటున్నారు. వృత్తిపరమైన ఒత్తిడి, డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా కుటుంబీకులెవరూ ఇంట్లోలేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News September 21, 2024

మాధ‌బి స‌మాచారం ఇచ్చేందుకు సెబీ నిరాకరణ

image

త‌మ ఛైర్మ‌న్ మాధ‌బికి సంబంధించిన వివ‌రాల‌ను బ‌హిర్గతం చేయ‌డానికి సెబీ నిరాక‌రించింది. ఆస్తులు, ఈక్విటీల‌పై మాధ‌బీ స‌మ‌ర్పించిన డిక్ల‌రేష‌న్ల‌ను బ‌హిర్గతం చేయ‌డం ఆమె వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌ను ప్ర‌మాదంలో ప‌డేసిన‌ట్టే అవుతుంద‌ని RTI దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది. కాంఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కార‌ణంగా ఆమె త‌ప్పుకున్న కేసుల వివ‌రాలు అందుబాటులో లేవని, వాటిని క్రోడీక‌రించ‌డానికి అధిక సమయం పడుతుందని తెలిపింది.

News September 21, 2024

కుక్కలకు పాండాలుగా రంగులు.. చైనాలో సందర్శకుల ఆగ్రహం

image

పాండాలను చూసేందుకు వచ్చే సందర్శకులను చైనాలో కొన్ని జూలు మోసం చేస్తున్నాయి. తాజాగా షాన్వీ జూలో కుక్కలకు పాండాల్లా రంగులు వేస్తున్నారని ఆరోపిస్తూ ఓ సందర్శకుడు వీడియో తీసి నెట్లో పెట్టారు. తొలుత అవి పాండా డాగ్స్ అనే జాతి అంటూ బుకాయించిన జూ నిర్వాహకులు, తర్వాత ఆరోపణలు నిజమని ఒప్పుకొన్నారు. దీంతో సందర్శకుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ డబ్బులు వెనక్కివ్వాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.

News September 21, 2024

JKకు రాష్ట్ర హోదా మా ప్రాధాన్యం: కాంగ్రెస్‌

image

జ‌మ్మూక‌శ్మీర్‌కు రాష్ట్ర హోదా క‌ల్పించ‌డ‌మే త‌మ మొద‌టి ప్రాధాన్య‌మ‌ని కాంగ్రెస్ తెలిపింది. జ‌మ్మూలో ఆ పార్టీ అధ్యక్షుడు ఖ‌ర్గే మాట్లాడుతూ JKకు కాంగ్రెస్ ఇచ్చిన ఏడు హామీల్లో రాష్ట్ర హోదా మొద‌టి ప్రాధాన్య‌మ‌న్నారు. అలాగే ప్ర‌తి కుటుంబానికి రూ.25 ల‌క్ష‌ల ఆరోగ్య బీమా క‌ల్పిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. జ‌మ్మూక‌శ్మీర్‌కు బీజేపీ చేసిందేమీ లేద‌ని, ఉద్యోగాల పేరుతో యువ‌త‌ను వంచించింద‌ని ఖ‌ర్గే విమ‌ర్శించారు.