News April 6, 2025

కనులపండువగా ఎదుర్కోలు వేడుక (PHOTOS)

image

TG: రేపు శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో ఎదుర్కోలు ఉత్సవం ఇవాళ కనులపండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రేపు ఉదయం మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. ఇందుకోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానుండటంతో 1800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Similar News

News December 1, 2025

వీటిపై తిరుపతి, చిత్తూరు MPలు మాట్లాడేనా..?

image

కడప-రేణిగుంట హైవే నిర్మాణానికి ఫారెస్ట్ శాఖ అనుమతులు ఇచ్చినా వర్కింగ్ పర్మిషన్ ఇంకా రాలేదు. ఇటీవల కళత్తూరు హరిజనవాడలో చెరువు తెగి అందరూ నష్టపోగా సరైన సాయం అందలేదు. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ నుంచి అంతర్జాతీయ సర్వీసులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటుపై అడుగులు పడలేదు. నేటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో వీటిపై తిరుపతి, చిత్తూరు MPలు గురుమూర్తి, ప్రసాదరావు గళమెత్తుతారా? లేదా?

News December 1, 2025

రబీ వరి.. సాగు విధానం, ఎకరాకు విత్తన మోతాదు

image

☛ నాట్లు వేసే పద్ధతిలో- 20 కేజీల విత్తనం
☛ పొడి విత్తనం వెదజల్లే పద్ధతిలో 25-30 కేజీల విత్తనం
☛ మండి కట్టిన విత్తనం వెదజల్లే పద్ధతిలో 12-15 కిలో విత్తనం
☛ గొర్రు విత్తే పద్ధతిలో 15-20 కిలోల విత్తనం
☛ యంత్రాలతో నాటే విధానంలో 12-15 కిలోల విత్తనం
☛ బెంగాల్ నాటు విధానంలో అయితే 10-12 కిలోల విత్తనం
☛ శ్రీ పద్ధతిలో వరి నాటితే 2 కిలోల విత్తనం ఎకరాకు సరిపోతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

News December 1, 2025

అభ్యర్థులతో ప్రధాన పార్టీలకు ‘పంచాయితీ’!

image

TG: పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, BRS, BJPలకు సొంత నేతల నుంచే ప్రమాదం పొంచి ఉంది. పలు గ్రామాల్లో ఒకే పార్టీ నేతలు నామినేషన్ వేయడమే దీనికి కారణం. ఓట్లు చీలే అవకాశం ఉండటంతో వారికి నచ్చజెప్పి నామినేషన్ విత్ డ్రా చేసుకునేలా ఆయా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్టీ బలపరిచిన అభ్యర్థినే బరిలో ఉంచేలా పావులు కదుపుతున్నాయి. కాగా తొలి విడత నామినేషన్ల విత్ డ్రాకు ఈ నెల 3 ఆఖరు.