News March 19, 2024
రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్

శ్రీలంక స్టార్ స్పిన్నర్ హసరంగా తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నారు. వైట్ బాల్ క్రికెట్పై దృష్టి పెట్టేందుకు గతంలో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా బోర్డు సూచనతో నిర్ణయం మార్చుకున్నారు. ఈ నెల 22 నుంచి బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ సిరీస్కు లంక జట్టులో ప్లేస్ సాధించారు. దీంతో ఐపీఎల్లో SRH జట్టు తరఫున తొలి 3 మ్యాచ్లకు అతడు దూరమయ్యే అవకాశం ఉంది.
Similar News
News January 22, 2026
ఎండోమెంట్ వ్యవసాయేతర భూముల లీజును తప్పుబట్టిన హైకోర్టు

AP: దేవాలయ వ్యవసాయేతర భూములను సుదీర్ఘకాలం లీజుకు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఛారిటీ సంస్థలకు భూముల్ని లీజుకు ఇచ్చేలా ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.15ను నిలిపివేసింది. దేవదాయ భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు వాదించగా, ఇప్పటికే లీజులు పొందిన వారిని ఖాళీ చేయించడం కష్టతరంగా మారిందని AG వాదించారు. అనంతరం కోర్టు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
News January 22, 2026
WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అధికారికంగా వైదొలిగేందుకు అమెరికా సిద్ధమైంది. ట్రంప్ 2025లో పదవిలోకి వచ్చిన తొలి రోజే ఈ విషయాన్ని ప్రకటించారు. WHO నిధుల్లో సుమారు 18% USAనే ఫండింగ్ ఇచ్చేది. అమెరికా వెళ్లిపోతే ఆ సంస్థకి భారీ ఆర్థిక సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకూ ఇవ్వాల్సిన బకాయిలు ($260M) చెల్లించకుండానే US నిష్క్రమిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.
News January 22, 2026
260 మృతి ఘటన.. సంచలన రిపోర్ట్!

అహ్మదాబాద్లో గతేడాది కుప్పకూలి 260 మంది మృతికి కారణమైన ఎయిరిండియా బోయింగ్ 787కు సంబంధించి USకు చెందిన ఓ NGO సంచలన విషయాలు వెల్లడించింది. BBC కథనం ప్రకారం.. 2014లో సర్వీసులో చేరిన ఆ విమానంలో తొలిరోజు నుంచే సమస్యలు తలెత్తినట్లు అక్కడి సెనేట్కు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఇంజినీరింగ్, తయారీ, క్వాలిటీ, నిర్వహణ లోపాల వల్లే ఇవి తలెత్తినట్లు ఇంటర్నల్ డాక్యుమెంట్లలో గుర్తించామని తెలిపింది.


