News June 23, 2024
ప్రియుడిని పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ను పెళ్లి చేసుకున్నారు. కొద్దిమంది బంధువులు, మిత్రుల సమక్షంలో వీరి వివాహం ముంబైలో ఘనంగా జరిగింది. వెడ్డింగ్ ఫొటోలను సోనాక్షి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. పెళ్లి సమయంలో ఆమె తెలుపురంగు ‘చికంకారి’ ఎంబ్రాయిడరీ చీర ధరించారు. కాగా ఏడేళ్లుగా జహీర్, సోనాక్షి ప్రేమలో ఉన్నారు.
Similar News
News February 4, 2026
దేశీ మిర్చికి రికార్డు ధర.. క్వింటా రూ.41,200

TG: వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో దేశీ మిర్చి రికార్డు ధర పలికింది. క్వింటా మిర్చి రూ.41,200కు అమ్ముడుపోయింది. గత మూడేళ్లలో దేశీ మిర్చికి ఇదే రికార్డు ధర అని మార్కెట్ అధికారులు వెల్లడించారు. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన దస్తగిరి అనే రైతు తీసుకొచ్చిన 6 క్వింటాళ్ల దేశీ మిర్చిని వ్యాపారులు ఈ ధరకు కొనుగోలు చేశారు.
News February 4, 2026
గడాఫీ కుమారుడి హత్య

లిబియా నియంత గడాఫీ కుమారుడు సైఫ్ అల్ ఇస్లాం గడాఫీ(53)ని దుండగులు హత్య చేశారు. జింటాన్లోని ఇంటిపై నలుగురు సాయుధులు దాడి చేసి హతమార్చినట్లు ఆయన అడ్వైజర్ అబ్దుల్లా వెల్లడించారు. తన తండ్రి హయాంలో ఇస్లాం ఎలాంటి పదవి చేపట్టకపోయినా మితవాది, సంస్కర్త అనే ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. 2011 తిరుగుబాటులో గడాఫీ హతమైన తర్వాత 2021లో ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
News February 4, 2026
వరిలో ఈ తెగుళ్లు కనిపిస్తున్నాయా? నివారణ ఎలా?

తెలుగు రాష్ట్రాల్లో వరి పంట వివిధ దశల్లో ఉంది. ప్రస్తుతం చలి, వాతావరణ పరిస్థితుల వల్ల పంటలో పురుగులు, చీడపీడల ఉద్ధృతి ఎక్కువైంది. ప్రధానంగా వరిలో మానిపండు తెగులు, పాముపొడ(మాగుడు) తెగులు, రెల్లరాల్చు పురుగు, కాండం కుళ్లు/దుబ్బు కుళ్లు కనిపిస్తున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే పంట ఎదుగుదల తగ్గి, దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ తెగుళ్ల కట్టడికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.


