News June 13, 2024
రాజధాని లేని రాష్ట్రం తల లేని మొండెం లాంటిది: వెంకయ్యనాయుడు

AP: రాజధాని ఒక్కటే ఉండాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. రాజధాని లేని రాష్ట్రం తల లేని మొండెం లాంటిందని పేర్కొన్నారు. అమరావతి ఉద్యమం ఓ విలువైన పాఠమన్నారు. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపోయేదేం లేదని అమరావతి రైతులు నిరూపించారని అన్నారు. 1631 రోజుల శాంతియుత ఉద్యమం గొప్పదని పేర్కొన్నారు. చివరకు ప్రజల కోరిక నెరవేరడం సంతోషకరమని అన్నారు.
Similar News
News November 26, 2025
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

TG: ఇంటర్ పరీక్షల్లో బ్లాంక్ బార్ కోడ్ (బార్ కోడ్ లేని OMR షీట్లు) విధానానికి బోర్డు ముగింపు పలికింది. ఇక నుంచి ప్రింటెడ్ బార్ కోడ్ షీట్లతో ఎగ్జామ్స్ నిర్వహించనుంది. దీంతో పరీక్ష సమయంలో విద్యార్థులు మీడియం, సెకండ్ లాంగ్వేజ్ మార్చుకోవడం కుదరదు. ఏవైనా తప్పులుంటే ఈ నెలఖారులోగా నామినల్ రోల్స్ లిస్టులో సరి చేసుకోవాలి. బ్లాంక్ బార్ కోడ్ వల్ల ఫలితాల ప్రక్రియ ఆలస్యమవుతుండడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
News November 26, 2025
వచ్చే ఏడాది చివరికి కిలో వెండి రూ.6 లక్షలు: కియోసాకి

బంగారం, వెండి ధరలు భవిష్యత్తులో మరింతగా పెరుగుతాయని రచయిత, బిజినెస్మ్యాన్ రాబర్ట్ కియోసాకి అంచనా వేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 50 డాలర్లుగా ఉన్న ఔన్స్ వెండి ధరలు త్వరలోనే 7 డాలర్లకు పెరగవచ్చని, వచ్చే ఏడాది చివరికి 200 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో రూ.1.55 లక్షలు ఉన్న కిలో వెండి ధర రూ.6.2 లక్షలకు పెరిగే ఛాన్స్ ఉంది.
News November 26, 2025
వేరుశనగ పంటకు నీటిని ఏ సమయంలో అందించాలి?

వేరుశనగను విత్తే ముందు నేల తడిచేలా నీరు పెట్టి తగినంత పదును ఉన్నప్పుడు విత్తనం వేసుకోవాలి. మొదటి తడిని మొలక వచ్చిన 20-25 రోజులకు ఇవ్వాలి. దీని వల్ల పైరు ఒకేసారి పూతకు వచ్చి, ఊడలు కూడా సరిగా ఏర్పడి దిగుబడి బాగుంటుంది. తర్వాత నేల లక్షణం, బంక మట్టి శాతాన్ని బట్టి 7-10 రోజులకు ఒక నీటి తడినివ్వాలి. చివరి తడిని పంట కోతకు 4-7 రోజుల మధ్య అందించాలి. దీని వల్ల మొక్కలు పీకడం సులభం. గింజలు నేలలో ఉండిపోవు.


