News May 19, 2024

వరంగల్ ఎయిర్‌పోర్టుపై ముందడుగు

image

TG: వరంగల్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రాష్ట్రం సానుకూలత వ్యక్తం చేయడంతో AAI అధికారుల్లో కదలిక వచ్చింది. త్వరలో వారు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రస్తుతం 706 ఎకరాల భూమికి అదనంగా 253 ఎకరాలను ప్రభుత్వం కేటాయించగా.. 400 ఎకరాలు కావాలని AAI అధికారులు కోరుతున్నారు. అటు పూర్తిస్థాయిలో ఎయిర్‌పోర్టు నిర్మించాలా? లేక దశల వారీగా నిర్మించాలా? అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అనంతరం స్పష్టత రానుంది.

Similar News

News November 20, 2025

త్వరలో రెస్టారెంట్లు, సొసైటీల్లో ఎంట్రీకి ఆధార్!

image

ఆధార్ విషయంలో త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లలో లైవ్ ఈవెంట్‌కు వెళ్లాలన్నా, హౌసింగ్ సొసైటీల్లోకి ఎంట్రీ కావాలన్నా, ఏదైనా ఎగ్జామ్ రాయాలన్నా మీ గుర్తింపు కోసం ఆధార్ చూపించాల్సి రావొచ్చు. ఆఫ్‌లైన్ ఆధార్ వాడకాన్ని పెంచాలనే ఉద్దేశంతో UIDAI ఈ తరహా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వ్యక్తుల ప్రైవసీకి కూడా ఇది ఉపయోగపడుతుందని ఆ సంస్థ చెబుతోంది.

News November 20, 2025

TMC-HBCHలో ఉద్యోగాలు

image

విశాఖపట్నంలోని <>TMC<<>>-హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్& రీసెర్చ్ సెంటర్ 2 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి DMLT/ డిగ్రీ(MLT)/ బీఎస్సీ(హిమటాలజీ)/ ఎంఎస్సీ (ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవంగల వారు ఈనెల 24న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. వెబ్‌సైట్: https://tmc.gov.in/

News November 20, 2025

శబరిమల బంగారం చోరీ కేసులో మరో అరెస్ట్

image

శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(TDB) మాజీ ప్రెసిడెంట్, CPM మాజీ ఎమ్మెల్యే పద్మా కుమార్‌ను సిట్ అరెస్ట్ చేసింది. ఆలయం నుంచి కొన్ని విగ్రహాల బంగారు తాపడం చోరీకి గురవడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో పద్మ కుమార్‌ను అధికారులు ఇవాళ ఉదయం నుంచి కొన్ని గంటల పాటు ప్రశ్నించారు. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో TDB మాజీ కమిషనర్‌తో పాటు పలువురు అరెస్ట్ అయ్యారు.