News October 28, 2025

దూసుకొస్తున్న తుఫాను.. బయటికి రావొద్దు!

image

AP: పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో ఉన్న ‘మొంథా’ తుఫాను గడిచిన 6గంటల్లో 15Kmph వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా కదిలిందని APSDMA తెలిపింది. ప్రస్తుతానికి మచిలీపట్నంకి 280km, కాకినాడకు 360km, విశాఖపట్నంకి 410km దూరంలో కేంద్రీకృతమై ఉందని చెప్పింది. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని హెచ్చరించింది. అత్యవసరమైతే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించింది.

Similar News

News October 28, 2025

వాట్సాప్‌లో ‘కవర్ ఫొటో’ ఫీచర్!

image

వాట్సాప్ యూజర్లకు త్వరలో ‘కవర్ ఫొటో’ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఫేస్‌బుక్, X తరహాలో ఇందులోనూ ప్రొఫైల్ పిక్ బ్యాక్ గ్రౌండ్‌లో కవర్ ఫొటోను యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం బిజినెస్ అకౌంట్లకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను సాధారణ వినియోగదారుల కోసం డెవలప్ చేస్తున్నారు. ప్రొఫైల్ పిక్‌ సెట్టింగ్స్ తరహాలోనే కవర్ ఫొటోను ఎవరెవరు చూడాలనేది కూడా యూజర్లు డిసైడ్ చేసుకోవచ్చు.

News October 28, 2025

SBIలో 10 పోస్టులు… అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

SBI‌లో 10 డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBA, PGDM, PGDBM, CFA/CA అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు గరిష్ఠ వయసు 45ఏళ్లు, మేనేజర్ పోస్టుకు 36ఏళ్లు, డిప్యూటీ మేనేజర్ పోస్టుకు 30ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in/

News October 28, 2025

కర్నూలు ప్రమాదం.. 19 వాహనాలు తప్పించుకున్నాయ్!

image

AP: కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బైకర్ శివశంకర్ 2.45amకు డివైడర్‌ను ఢీకొట్టి అక్కడికక్కడే చనిపోగా, బైకు రోడ్డు మధ్యలో పడింది. vకావేరీ బస్సు 2.55am ప్రాంతంలో బైకును ఢీకొట్టింది. అయితే ఈ మధ్యలో 19 వాహనాలు బైకును తప్పించుకొని వెళ్లాయి. ఈ బస్సు డ్రైవర్‌కు అది కనిపించలేదా? నిర్లక్ష్యమా? అనేది తేలాల్సి ఉంది. ఆ బైకును ఒక్కరు పక్కకు జరిపినా 19ప్రాణాలు దక్కేవి.