News September 1, 2024

తీరం దాటిన వాయుగుండం.. భారీ వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో అర్ధరాత్రి 12.30-2.30 మధ్య తీరాన్ని దాటింది. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, నంద్యాల, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. లోతట్టు, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Similar News

News November 6, 2025

బిహార్ అప్డేట్: 11 గంటల వరకు 27.65% పోలింగ్

image

బిహార్‌లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 27.65 శాతం పోలింగ్ నమోదైంది. కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులుదీరారు. సీఎం నితీశ్ కుమార్, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

News November 6, 2025

ఉపఎన్నిక ప్రచారానికి కేసీఆర్ ఇక రానట్టేనా!

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి KCR రానట్లేనని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నిక బాధ్యతను పూర్తిగా కేటీఆరే తీసుకున్నారు. ఇప్పుడు ప్రచార పర్వం రేవంత్ vs KTRగా వేడెక్కింది. తండ్రి మరణంతో 10 రోజులు ప్రచారానికి దూరంగా ఉన్న హరీశ్ రావు ఈ 3 రోజులు యాక్టివ్ కానున్నారు. KCR ఒక్కసారి రావాలని పార్టీ క్యాడర్ ఆశిస్తున్నా… గెలుస్తామనే ధీమా, అనారోగ్యం కారణంగా ఆయన వచ్చే అవకాశం కనిపించడం లేదు.

News November 6, 2025

అల్లు అర్జున్ నుంచి భారీ ప్రాజెక్టులు!

image

అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిని పాన్ వరల్డ్ రేంజ్‌లో 2027లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత బన్నీ ఏయే ప్రాజెక్టులు చేయబోతున్నారు అన్న దానిపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ లిస్ట్‌లో సంజయ్ లీలా భన్సాలీ, రాజమౌళి, ప్రశాంత్ నీల్, బోయపాటి శ్రీను(సరైనోడు 2) పేర్లు వినిపిస్తున్నాయి. ప్రతి ప్రాజెక్ట్ భారీగా ఉంటుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.