News October 13, 2024

ఉపాధి హామీ పనుల ప్రభావంపై అధ్యయనం

image

క్షేత్ర‌స్థాయిలో ఉపాధి హామీ ప‌థకం ప‌నితీరు, దాని ప్ర‌భావంపై అధ్య‌య‌నం చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు నీతి ఆయోగ్ DMEO శాఖ అధ్యయ‌నానికి బిడ్లు ఆహ్వానించింది. వివిధ ద‌శ‌ల్లో క‌న్స‌ల్టెంట్ల‌ను ఎంపిక చేస్తారు. క్షేత్ర‌స్థాయిలో ఇంటింటి స‌ర్వే ద్వారా గ‌త ఐదు ఆర్థిక సంవత్స‌రాల్లో జ‌రిగిన ప‌నుల ప్ర‌భావంపై క‌న్స‌ల్టెంట్ అధ్యయనం చేసి ఆరు నెలల్లోపు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.

Similar News

News November 23, 2025

పిఠాపురం: ‘మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

image

డిసెంబర్ 13వ తేదీన జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీహరి తెలిపారు. పిఠాపురం కోర్ట్ ఆవరణంలో పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కేసులు రాజీ చేయడానికి సలహాలు, సూచనలందించారు. లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకుని అప్పీలు లేని అంతిమ తీర్పును పొందచ్చని జిల్లా జడ్జ్ శ్రీహరి అధికారులకు చెప్పారు. అధిక కేసులు రాజీ అయ్యేటట్లు చూడాలన్నారు.

News November 23, 2025

పిఠాపురం: ‘మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

image

డిసెంబర్ 13వ తేదీన జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీహరి తెలిపారు. పిఠాపురం కోర్ట్ ఆవరణంలో పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కేసులు రాజీ చేయడానికి సలహాలు, సూచనలందించారు. లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకుని అప్పీలు లేని అంతిమ తీర్పును పొందచ్చని జిల్లా జడ్జ్ శ్రీహరి అధికారులకు చెప్పారు. అధిక కేసులు రాజీ అయ్యేటట్లు చూడాలన్నారు.

News November 23, 2025

కృష్ణా: కార్యాలయ పరిసరాలు శుభ్రం చేసిన కలెక్టర్

image

స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కలెక్టరేట్ ప్రాంగణంలోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు. కలెక్టర్‌తో పాటు డీపీఓ అరుణ, డీఆర్ఓ చంద్రశేఖరరావు, కలెక్టరేట్ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొని చెత్తా చెదారాలను తొలగించారు. వివిధ శాఖల ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.