News March 22, 2025
సైబర్ నేరగాళ్లకూ టార్గెట్.. ఛేదించకపోతే నరకమే!

ఉద్యోగాల కోసం ఏజెంట్ ద్వారా మయన్మార్, థాయ్లాండ్కు వెళ్లి సైబర్ ముఠా వలలో చిక్కుకున్న 589 మంది భారతీయులను కేంద్రం రక్షించింది. సైబర్ క్రైమ్స్ చేయడమే ఆ ఉద్యోగమని తెలియక అక్కడికి వెళ్లి నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ‘వీసా లాక్కుంటారు. టార్గెట్స్ చేరుకోకపోతే ఎండలో 4కి.మీలు పరిగెత్తిస్తారు. పుష్అప్స్ చేయిస్తారు. పాడైపోయిన బాతు గుడ్లు తినిపిస్తారు’ అని తెలంగాణకు చెందిన ఓ బాధితుడు BBCతో చెప్పారు.
Similar News
News December 13, 2025
అంధ క్రికెటర్ల ఇళ్లలో కాంతులు

AP: అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక(సత్యసాయి), ప్లేయర్ పాంగి కరుణ (అల్లూరి) ఇళ్లలో Dy.CM పవన్ కళ్యాణ్ కాంతులు నింపారు. వారికి TV, ఫ్యాన్, ఇతర గృహోపకరణాలు, నిత్యావసరాలు, బట్టలు, దుప్పట్లు పంపించారు. క్రీడాకారుల కోటాలో కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తమ ఊరికి వెళ్లే 2 రోడ్లు ప్రయాణానికి యోగ్యంగా లేవని దీపిక చెప్పడంతో రూ.6.2 కోట్లతో రోడ్లను పవన్ <<18548703>>మంజూరు<<>> చేయడం తెలిసిందే.
News December 13, 2025
ఓటేయడానికి వెళ్తున్నారా.. జాగ్రత్త!

TG: రేపు పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఉన్న విషయం తెలిసిందే. HYD, ఇతర ప్రాంతాల్లోని ఓటర్లు సొంతూళ్లకు ప్రయాణాలు చేస్తున్నారు. కొందరు బైకులపైనే వెళ్తుండటంతో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇద్దరు యువకులు బైక్పై వెళ్తుండగా ప్రమాదానికి గురై స్టేషన్ఘన్పూర్లో ప్రాణాలు కోల్పోయారు. మరో ప్రమాదం మెదక్(D) పెద్దశంకరంపేటలో జరిగింది. బైక్పై వెళ్తున్న దంపతులు, వారి ఇద్దరు పిల్లలు చనిపోయారు.
News December 13, 2025
Nobel Prize: వేషం మార్చి, పడవల్లో వెళ్లి..

నోబెల్ అందుకునేందుకు వెనిజుల ప్రతిపక్ష నేత మరియా మచాడో పెద్ద సాహసమే చేశారు. బయట కనపడితే అరెస్ట్ చేద్దామనుకున్న ప్రభుత్వ కళ్లు గప్పి 3 రోజులు కష్టపడి నార్వేకు చేరుకున్నారు. US సైనిక నిపుణులు ‘ఆపరేషన్ గోల్డెన్ డైనమైట్’ చేపట్టి మచాడో వేషం మార్చి, పడవల్లో తీసుకెళ్లారు. డిజిటల్ ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్త పడ్డారు. అయినా ఆలస్యం కావడంతో ఆమె కుమార్తె నోబెల్ పురస్కారాన్ని స్వీకరించారు.


