News January 7, 2025

12న అరకులో సుప్రీం జడ్జిల బృందం పర్యటన

image

AP: పర్యాటక ప్రాంతం అరకులో ఈ నెల 12న సుప్రీంకోర్టు జడ్జిలు పర్యటించనున్నారు. CJI, 25మంది జడ్జిలు, రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి రానుండటంతో అల్లూరి జిల్లా జేసీ ఏర్పాట్లు చేస్తున్నారు. వారు ఆదివారం విశాఖ నుంచి రైలులో బయలుదేరి ఉ.10.30కు అరకులోయకు చేరుకుంటారు. హరిత వేలీ రిసార్టులో విశ్రాంతి అనంతరం గిరిజన మ్యూజియం, గిరి గ్రామదర్శిని, అనంతగిరి కాఫీ తోటలు, బొర్రా గుహలు సందర్శిస్తారని జేసీ తెలిపారు.

Similar News

News January 29, 2026

నేడు అజిత్ పవార్ అంత్యక్రియలు

image

ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు ఇవాళ ఉ.11 గంటలకు జరగనున్నాయి. ఆయన సొంత నియోజకవర్గం బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. పవార్ అంత్యక్రియలకు PM మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, MH సీఎం ఫడణవీస్, AP మంత్రి లోకేశ్ హాజరవనున్నారు. నిన్న జరిగిన విమాన ప్రమాదంలో అజిత్ సహా ఐదుగురు మరణించారు.

News January 29, 2026

మొక్కజొన్న పంటకు నీరు – ఈ జాగ్రత్తలు తప్పనిసరి

image

మొక్కజొన్న పూత దశలో నీటి ఎద్దడి వల్ల మగపూలు, పీచు ఎండిపోయి, పరాగ సంపర్కం సరిగా జరగక, పై ఆకులు ఎండిపోయి కండెలో గింజల సంఖ్య, పరిమాణం తగ్గుతుంది. పంట పూత దశ నుంచి గింజలు పాలు పోసుకునే వరకు పంట నీటి ఎద్దడికి గురైతే 40 నుంచి 80 శాతం వరకు దిగుబడులు తగ్గుతాయి. గింజ కట్టే సమయంలో నీటి ఎద్దడి ఏర్పడితే గింజ పరిమాణం తగ్గుతుంది. అందుకే పంట ఎదిగే దశలో ఎక్కువ వ్యవధితో, పూత దశలో తక్కువ వ్యవధితో నీరు పెట్టాలి.

News January 29, 2026

జుట్టు జిడ్డు ఇలా తగ్గిద్దాం..

image

కాలుష్యం, దుమ్మూ తోడై కొందరి జుట్టు త్వరగా జిడ్డుగా మారుతుంది. దానికోసం ఈ చిట్కాలు.. * షాంపూలో స్పూన్ కలబంద, కాస్త నిమ్మరసం చేర్చి బాగా కలిపి తలకు పెట్టుకోవాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. * రెండు స్పూన్ల ముల్తానీమట్టికి తగినంత నీరు కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. * తలస్నానం చేసిన జుట్టుకు బ్లాక్ టీని పట్టించి ఇరవైనిమిషాల తర్వాత కడిగేయాలి.