News March 27, 2024

కన్నీళ్లు పెట్టించే ఘటన

image

TG: నారాయణపేట జిల్లా గోపాల్‌పేటలో హృదయవిదారక ఘటన జరిగింది. స్థానికుడు రమేశ్ కూతురు లక్ష్మీప్రణీత(13) హోలీరోజు మినీ వాటర్ ట్యాంకు కూలి మరణించింది. అంత్యక్రియల అనంతరం ఇంటికి వచ్చిన రమేశ్ స్నానం చేసి బయటికి వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు వెతుక్కుంటూ వెళ్లారు. రమేశ్ తన కూతురిని పూడ్చిపెట్టిన స్థలం పక్కనే నిద్రిస్తూ కనిపించాడు. ఈ ఘటన చూసి అక్కడున్నవాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు.

Similar News

News March 19, 2026

హార్ముజ్ ఒక్కటే కాదు..: కేంద్రం

image

హార్ముజ్‌పై భారత్ డిపెండెన్సీ తగ్గిందని.. 70% క్రూడ్‌ ఇతర ప్రాంతాల నుంచి వస్తోందని కేంద్రం తెలిపింది. LPG సరఫరాను వికేంద్రీకరించేందుకు కృషి చేస్తున్నామంది. రెగ్యులర్‌గా దిగుమతి చేసుకునే ఖతర్‌తో పాటు ఇతర దేశాల నుంచి కూడా కొనుగోలు పెంచనున్నట్లు తెలిపింది. అవసరమైతే రష్యా నుంచి కూడా LPG కొంటామని పేర్కొంది. మరోవైపు హార్ముజ్ నుంచి వెళ్లే నౌకలకు టోల్‌ఛార్జ్ విధించే ప్రతిపాదనను ఇరాన్ పరిశీలిస్తోంది.

News March 19, 2026

అరుదైన బ్లడ్ గ్రూప్.. 50 మందికి మాత్రమే!

image

మనందరిలో ప్రధానంగా నాలుగు గ్రూపుల రక్తం ఉంటుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా 50 మందికి మాత్రమే ఉండే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ‘Rh-Null’ అనే విషయం మీకు తెలుసా? దీనినే ‘గోల్డెన్ బ్లడ్’ అని పిలుస్తారు. ఇందులో ఏ రకమైన యాంటిజెన్లు ఉండవు, అందుకే ఈ రక్తం ఎవరికైనా సెట్ అవుతుంది. కానీ వీరికి రక్తం కావాలంటే మాత్రం దొరకడం చాలా కష్టం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో

News March 19, 2026

జ్యోతిషుడు అరెస్టు.. మహిళలతో 58 అసభ్యకర వీడియోలు

image

మహారాష్ట్రలో ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’ లాంటి ఘటన సంచలనం రేపుతోంది. నాసిక్‌కు చెందిన జ్యోతిషుడు అశోక్ కారత్‌ తన వద్దకు వచ్చే మహిళలకు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేసేవాడని పోలీసులు గుర్తించారు. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ దోపిడీ చేసేవాడన్నారు. అతడిని అరెస్టు చేసి 58 అసభ్యకర వీడియోలను సీజ్ చేశారు. అశోక్ గతంలో నేవీలో పని చేశాడు. ఇతడికి MH రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలతో సంబంధాలున్నాయి.