News February 19, 2025
‘ఉప్పు’ ముప్పును దూరం చేసే టీస్పూన్!

ఉప్పు తినడాన్ని తగ్గించాలని వైద్యులు సూచిస్తున్న వేళ జపాన్ సైంటిస్టులు ‘ఎలక్ట్రిక్ సాల్ట్ స్పూన్’ను అభివృద్ధి చేశారు. ఏదైనా ఆహారంలో ఉప్పు వేయకున్నా ఆ రుచిని ఈ స్పూన్ మీకు అందిస్తుంది. ఇది తేలికపాటి విద్యుత్ ప్రవాహాన్ని పంపించి నాలుకలో ఉండే టేస్టింగ్ గ్రంథులను ఉత్తేజపరిచి ఉప్పు రుచిని అందిస్తాయి. దీనిని వాడటం వల్ల అధిక రక్తపోటు వంటి ప్రమాదాలను నివారించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Similar News
News November 19, 2025
వాట్సాప్ ఛానెల్ ద్వారా ‘జైషే’ ఉగ్ర ప్రచారం

ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ డిజిటల్ నెట్వర్క్ ద్వారా యువతను టెర్రరిజమ్ వైపు మళ్లిస్తోంది. ఈ సంస్థకు సంబంధించిన వాట్సాప్ ఛానెల్ను నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ ఛానెల్కు 13వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీని ద్వారా వేలాది మందిని ఉగ్రమూకలుగా JeM మారుస్తోంది. కాగా ఢిల్లీ పేలుళ్ల కేసులో అరెస్టు చేసిన డానిష్ను పోలీసులు పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. అతడిని 10 రోజుల పాటు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది.
News November 19, 2025
24 ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్లు: సత్యకుమార్ యాదవ్

AP: అత్యవసర వైద్య సేవల కోసం 24 ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్(CCB)లు అందుబాటులోకి రానున్నాయి. PMABHIM కింద ₹600 కోట్లతో వీటిని ఏర్పాటుచేస్తున్నారు. వీటి పురోగతిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్షించారు. వీటిలో 13 వచ్చే నెలాఖరుకు, మిగతావి 2026 ఆగస్టు నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. కోవిడ్లో అత్యవసర వైద్యానికి ఇబ్బంది అయ్యింది. అటువంటివి మళ్లీ రాకుండా కేంద్రం దేశంలో 621 CCBలను నెలకొల్పుతోంది.
News November 19, 2025
X(ట్విటర్) డౌన్

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X(ట్విటర్) డౌన్ అయింది. ట్వీట్లు చేయలేకపోతున్నామని యూజర్లు ఇతర SM పేజీల్లో కామెంట్లు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే తరహా ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తోంది. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? COMMENT


