News November 19, 2024

CAGగా తెలుగు వ్యక్తి

image

భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG)గా ఏపీకి చెందిన IAS ఆఫీసర్ కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నారు. సంజయ్ మూర్తిని CAGగా నియమిస్తూ రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. సంజయ్ మూర్తి తండ్రి KSR మూర్తి అమలాపురం ఎంపీగా పని చేశారు. 1964లో జన్మించిన సంజయ్ 1989లో హిమాచల్‌ప్రదేశ్ క్యాడర్‌లో IASగా ఎంపికయ్యారు.

Similar News

News November 22, 2025

త్వరలో లెక్చరర్ పోస్టుల భర్తీ: లోకేశ్

image

AP: వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 4,300 అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తామని, త్వరలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. విద్యార్థి, యువజన సంఘాల నాయకులతో భేటీలో ఈమేరకు హామీ ఇచ్చారు. కాలేజీలు, వర్సిటీల్లో రాజకీయ ప్రసంగాలకు అనుమతించబోమని తేల్చి చెప్పారు. విద్యాసంస్థల పనివేళలు పూర్తయిన తర్వాత రాజకీయేతర సమస్యలు చెప్పుకోవడానికి ప్రత్యేక వేదికపై అవకాశం కల్పిస్తామన్నారు.

News November 22, 2025

త్వరలో లెక్చరర్ పోస్టుల భర్తీ: లోకేశ్

image

AP: వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 4,300 అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తామని, త్వరలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. విద్యార్థి, యువజన సంఘాల నాయకులతో భేటీలో ఈమేరకు హామీ ఇచ్చారు. కాలేజీలు, వర్సిటీల్లో రాజకీయ ప్రసంగాలకు అనుమతించబోమని తేల్చి చెప్పారు. విద్యాసంస్థల పనివేళలు పూర్తయిన తర్వాత రాజకీయేతర సమస్యలు చెప్పుకోవడానికి ప్రత్యేక వేదికపై అవకాశం కల్పిస్తామన్నారు.

News November 21, 2025

మరికొన్ని గంటల్లో భారీ వర్షం

image

AP: బంగాళాఖాతంలో రేపు <<18351099>>అల్పపీడనం<<>> ఏర్పడనున్న నేపథ్యంలో అర్ధరాత్రి నుంచి రేపు ఉ.9 గంటల వరకు తిరుపతి, నెల్లూరులో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. రేపు మధ్యాహ్నానికి చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాలకూ వర్షాలు విస్తరించే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా నిన్న అర్ధరాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షం దంచికొట్టిన విషయం తెలిసిందే.