News March 29, 2024

‘ఓం’ ఆకారంలో ఆలయం

image

ప్రపంచంలోనే తొలి ఓం ఆకారం ఆలయాన్ని రాజస్థాన్‌లో నిర్మించారు. దీన్ని పాలి జిల్లాలోని జదాన్ గ్రామంలో 250 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఇందులో 12 జ్యోతిర్లింగాలతో పాటు 1,008 శివుడి విగ్రహాలున్నాయి. 5వ శతాబ్దానికి చెందిన నాగర శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించారు.

Similar News

News April 6, 2026

BREAKING: ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్ విడుదల

image

ఏపీ రాజధానిగా అమరావతికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది. రాజ్యసభ నుంచి తన వద్దకు వచ్చిన రాజధాని బిల్లును ఆమోదిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం చేశారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర న్యాయశాఖ విడుదల చేసింది. 2024 జూన్ 2 నుంచి ఇది అమలులోకి వస్తుందని ప్రకటనలో పేర్కొంది. CRDA-2014 చట్టంలో పొందుపరిచిన అమరావతిని రాజధానిగా కేంద్రం నోటిఫై చేసింది.

News April 6, 2026

జూన్ నుంచి మరింత తక్కువ ధరకు ఇన్సూరెన్స్?

image

IRDAI డెవలప్ చేసిన బీమా సుగమ్ పోర్టల్‌లో జూన్ నుంచి జీరో కమీషన్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఏజెంట్లతో పనిలేకుండా ఇన్సూరెన్స్‌ సంస్థలు ఈ పోర్టల్‌కు కేవలం 5-7% ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఫలితంగా ప్రీమియమ్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. JUNలో వెహికల్ ఇన్సూరెన్స్ లాంచ్ కానుంది. ఇక AUGలో హెల్త్ ఇన్సూరెన్స్, SEPలో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

News April 6, 2026

60 ఏళ్ల వరకే బీమా.. ప్రభుత్వం సంప్రదింపులు!

image

TG: రూ.5 లక్షల <<19431944>>బీమా<<>> పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందిస్తోంది. కాగా ఇలాంటి బీమా 60 ఏళ్ల వయసు వరకే వర్తిస్తుందని జీవిత బీమా సంస్థల నుంచి సర్కారుకు సమాచారం అందింది. అయితే అన్ని వయసుల వారికి వర్తింపజేసే అవకాశం ఏదైనా ఉందా? అనే విషయంపై ఆర్థిక శాఖ అధికారులు వివిధ బీమా సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. 2026-2027 బడ్జెట్‌లో ఈ కొత్త పథకం కోసం రూ.4,000 కోట్లు కేటాయించారు.