News April 25, 2024
నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ఉత్కంఠ పోరు

నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్సభ స్థానంలో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. గతంలో వార్తల్లో సంచలనంగా నిలిచిన ఢిల్లీ JNUSU మాజీ ప్రెసిడెంట్ కన్హయ్య కుమార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన 2019లో బిహార్లోని బెగూసరాయ్ నుంచి CPI తరఫున పోటీ చేసి ఓడారు. 2021లో కాంగ్రెస్లో చేరారు. ఇటు BJP నుంచి సీనియర్ నేత మనోజ్ తివారీ బరిలో నిలిచారు. దీంతో సీనియర్, జూనియర్ లీడర్ల మధ్య పోరు ఉత్కంఠగా మారింది.
Similar News
News October 26, 2025
బస్సు ప్రమాదం.. బైకును తొలగిస్తే 19 మంది బతికేవారు!

AP: కర్నూలు బస్సు ప్రమాదానికి ముందు మరో 3 బస్సులు రోడ్డుపై పడిపోయిన బైకును చూసి పక్క నుంచి వెళ్లాయి. కానీ ఆ <<18106434>>బైకును<<>> రోడ్డుపై నుంచి తొలగించే ప్రయత్నం చేయలేదు. అలా చేసి ఉంటే ఈ ఘోర ప్రమాదం తప్పేది. 19 మంది ప్రాణాలతో ఉండేవారు. డ్రైవర్ ఆ బైకుపై నుంచి బస్సును పోనిచ్చాడు. మంటలు చెలరేగగానే భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. ప్రయాణికులకు సమాచారం ఇచ్చినా అందరూ బస్సు దిగి ప్రాణాలు రక్షించుకునేవారు.
News October 26, 2025
SSC దరఖాస్తు సవరణ తేదీల్లో మార్పులు

SSC వివిధ పోస్టుల దరఖాస్తులో తప్పుల సవరణ తేదీలను ప్రకటించింది. కానిస్టేబుల్ (డ్రైవర్), హెడ్ కానిస్టేబుల్ (AWO) పోస్టులకు దరఖాస్తు సవరణ ఈనెల 31 – NOV 2వరకు చేసుకోవచ్చు. SI పోస్టులకు NOV 3 – 5 వరకు, HC (మినిస్టీరియల్) పోస్టులకు NOV 5 – 7 వరకు , కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులకు NOV 7 – 9 వరకు సవరణ చేసుకోవచ్చు. CHSL ఎగ్జామ్ స్లాట్ సిటీ, తేదీ, షిఫ్ట్ను ఈ నెల 28 వరకు ఎంపిక చేసుకోవచ్చు.
News October 26, 2025
ఎలాంటి ఎర పంటలను ఏ పంటల్లో వేస్తే మంచిది?

☛ పత్తి, వేరుశనగ పంటల్లో ఆముదపు పంటను ఎరపంటగా వేసి పొగాకు లద్దె పురుగుల్ని, బంతి మొక్కలు వేసి శనగ పచ్చపురుగులను సులభంగా నివారించవచ్చు. ☛ క్యాబేజీలో సాధారణంగా వచ్చే డైమండ్ బ్యాక్ మాత్ను ఆవాలు పంటను వేసి నివారించవచ్చు. ☛ వేరుశనగలో అలసందలు వేసి ఎర్రగొంగళి పురుగుల ఉద్ధృతిని తగ్గించవచ్చు. ☛ అలసంద పంటలో ఆవాలు ఎర పంటగా వేసి గొంగళిపురుగు, పొద్దుతిరుగుడు వేసి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు.


