News January 29, 2025

ఘోర విషాదం.. 20 మంది మృతి?

image

మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 20 మంది మరణించినట్లు తెలుస్తోంది. 100 మంది భక్తులు గాయపడ్డారు. వారికి మేళా సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వైద్య శిబిరాల్లో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై అత్యవసర సమీక్ష నిర్వహించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శిబిరాల్లో ఉన్న క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాలని సూచించారు. ఘటనపై మోదీ, షా ఆరా తీశారు.

Similar News

News January 18, 2026

WC మ్యాచెస్‌పై ICCకి బంగ్లా మరో రిక్వెస్ట్

image

T20WC మ్యాచెస్ కోసం భారత్ వెళ్లేదిలేదని బంగ్లాదేశ్ ICCకి తేల్చి చెప్పింది. పలు చర్చల తర్వాత కూడా తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాల్సిందే అంటోంది. దీనిపై వచ్చే వారం ICC తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే ICCకి BCB కొత్త రిక్వెస్ట్ పెట్టింది. ఐర్లాండ్‌తో గ్రూపులు స్వాప్ చేసుకుంటామని చెప్పింది. ఐర్లాండ్ గ్రూప్ Bకి వస్తే, BAN గ్రూప్ Cకి వెళ్తుంది. అప్పుడు గ్రూప్ మ్యాచులు కొలంబో, పల్లెకెలెలో ఆడే వీలుంటుంది.

News January 18, 2026

సప్త సాగర యాత్ర గురించి మీకు తెలుసా?

image

చొల్లంగి అమావాస్య నాడు చొల్లంగి వద్ద సాగర సంగమ స్నానంతో సప్త సాగర యాత్ర ప్రారంభమవుతుంది. గోదావరి 7 పాయలు సముద్రంలో కలిసే 7 పుణ్య క్షేత్రాలను (చొల్లంగి, కోరంగి, తీర్థాలమొండి, నత్తల నడక, కుండలేశ్వరం, మందపల్లి/రైవా, అంతర్వేది) సందర్శించి భక్తులు స్నానాలు ఆచరిస్తారు. మాఘ శుక్ల ఏకాదశి నాడు అంతర్వేది వద్ద వశిష్ఠ నదిలో స్నానంతో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ యాత్ర చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం.

News January 18, 2026

USAలో నవీన్ హవా.. $1M+ కలెక్షన్స్‌‌లో హ్యాట్రిక్

image

‘అనగనగా ఒక రాజు(AOR)’ చిత్రంతో టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు. USAలో నవీన్ హవా ఎలా ఉంటుందో ఈ చిత్రంతో మరోసారి రుజువైంది. AOR సినిమా ఇప్పటికే అమెరికాలో $1M+ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు నిర్మాణ సంస్థ పేర్కొంది. జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాలు ఈ మార్కును దాటేయగా.. తాజాగా మూడో చిత్రంతో నవీన్ పొలిశెట్టి హ్యాట్రిక్ కొట్టేశారు.