News March 23, 2024
మూడంచెల వ్యూహం.. గెలుపే లక్ష్యం

TG: లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లను టార్గెట్గా పెట్టుకున్న కాంగ్రెస్.. మూడంచెల వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలు, పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ సమన్వయ కమిటీలు నియమించనుంది. ఈమేరకు శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దిశానిర్దేశం చేస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్పై వివరిస్తున్నారు. దీంతో ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు కానున్నాయి.
Similar News
News March 3, 2026
భారత్ యుద్ధానికి రెడీ అవుతోంది: పాక్ ప్రెసిడెంట్

భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందంటూ పాక్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన ఆరోపణలు చేశారు. ‘యుద్ధ క్షేత్రం నుంచి చర్చల టేబుల్ వద్దకు రండి’ అంటూ పార్లమెంట్ సాక్షిగా ఢిల్లీకి విజ్ఞప్తి చేశారు. మరోవైపు అఫ్గాన్ను భారత్ అనుకూల దేశంగా అభివర్ణించారు. వారిని సైతం చర్చలకు రావాలని కోరారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ గతంలో చేసిన మెరుపు దాడులతో పాక్ బెంబేలెత్తిపోయిన విషయం తెలిసిందే.
News March 3, 2026
ప్రపంచ యాత్రికుడు.. 24 ఏళ్ల వయసులోనే!

బిహార్కు చెందిన 24 ఏళ్ల కుర్రాడు నోమాడ్ శుభమ్ ప్రపంచ దేశాలను చుట్టేసి రికార్డు సృష్టించారు. మొత్తం 197 దేశాలను చుట్టేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా నిలిచాడు. అయితే విమానాల్లో ప్రయాణించకుండా కేవలం లిఫ్టులు, లోకల్ బస్సుల్లో వెళ్తూ ఈ ఘనత సాధించడం విశేషం. తన 16ఏళ్ల వయసులో మొదలైన ఈ సాహసయాత్ర 9ఏళ్ల పాటు కొనసాగి తాజాగా బ్రెజిల్లో ముగిసింది. సంకల్పం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చని శుభమ్ నిరూపించాడు.
News March 3, 2026
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు

<


