News January 28, 2025
గద్దర్ ఓ నరహంతకుడు: విష్ణువర్ధన్ రెడ్డి

బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి గద్దర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘గద్దర్పై అనేక కేసులు ఉన్నాయి. ఎంతోమంది ప్రాణాలు తీసిన నరహంతకుడతను. ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకి. నిషేధిత మావోయిస్టు సంస్థలో పనిచేసిన గద్దర్కు అవార్డు ఎలా ఇవ్వమంటారు? అతడికి, ఎల్టీటీఈకి పెద్ద తేడా లేదు. రాజీవ్ గాంధీని బలితీసుకున్న ఎల్టీటీఈకి కూడా రేవంత్ పద్మ అవార్డులు ఇవ్వమంటారా?’ అని ప్రశ్నించారు.
Similar News
News December 18, 2025
అధికారంలోకి రాగానే వారిని జైల్లో పెడతాం: జగన్

AP: మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు తీసుకునేవారిని తాము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే జైల్లో పెడతామని మాజీ సీఎం జగన్ హెచ్చరించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టడం పెద్ద స్కామ్ అని ఆరోపించారు. కోటి సంతకాలు చూడాలంటూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. ఈ అంశంలో చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెబుతామని వ్యాఖ్యానించారు. కోటి సంతకాల పత్రాలను కాసేపట్లో ఆయన గవర్నర్కు అందజేయనున్నారు.
News December 18, 2025
యాసంగిలో తగ్గిన ఉల్లి సాగు విస్తీర్ణం

TG: సరైన ధర, మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడం, తగ్గిన దిగుబడి, పెరిగిపోతున్న సాగు ఖర్చు కారణంగా యాసంగిలో ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గింది. ఈ ఏడాదిలో రబీలో కేవలం 5,200 ఎకరాల్లోనే ఉల్లిని సాగు చేస్తున్నారు. 12 జిల్లాల్లో ఒక్క ఎకరాలో కూడా ఉల్లి నాట్లు పడలేదు. గత ఏడాది కన్నా రబీ ఉల్లి సాగు విస్తీర్ణం సగానికి తగ్గింది. ఈ సీజన్లో అత్యధికంగా వనపర్తి జిల్లాలో 2,601 ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేస్తున్నారు.
News December 18, 2025
కలెక్టర్ల వినూత్న ఆలోచనలు… శభాష్ అన్న CM

AP: బెస్ట్ ప్రాక్టీసెస్ అమలుపై కలెక్టర్లను CM CBN మెచ్చుకున్నారు. అల్లూరిలో ‘యాస్పిరేషన్ ఇంజిన్’తో STUDENTS మంచి మార్కులు సాధిస్తున్నారు. మన్యంలో ‘ముస్తాబు’తో స్టూడెంట్స్లో శుభ్రత మెరుగైంది. ‘మార్పు’తో అక్రమ మద్య రహితంగా ఏలూరు(D) మారుతోంది. స్మార్ట్ కిచెన్లకు అగ్రి లింకప్తో కడప స్కూళ్లకు మంచి ఆహారం అందుతోంది. ATPలో రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, NLRలో అగ్రి యాంత్రీకరణతో మేలు జరుగుతోంది.


