News October 18, 2024
ఆంజనేయస్వామి ఆలయ కూల్చివేతలో ట్విస్ట్

AP: చిత్తూరు(D) మొలకలచెరువులో ఈ నెల 14న అభయ ఆంజనేయ స్వామి దేవాలయం <<14370148>>కూల్చివేత ఘటనలో<<>> ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆలయానికి వచ్చే డబ్బుల కోసం ఆ గుడి పూజారి విద్యాసాగర్, మరొక గుడి పూజారి హరినాథ్ మధ్య పోరు తలెత్తింది. ఈ క్రమంలో హరినాథ్ గుడిని ధ్వంసం చేశాడని పోలీసులు విచారణలో తేల్చారు. ఈ సంఘటనలో ఆరుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కారు, పేలుడు పదార్థాలు ఇనుప పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News December 4, 2025
థైరాయిడ్ ట్యూమర్స్ గురించి తెలుసా?

థైరాయిడ్ గ్రంథి పనితీరుపైనే మనిషి జీవక్రియలు ఆధారపడి ఉంటాయి. ఇంతటి ప్రధానమైన థైరాయిడ్ గ్రంథిలో కొన్నిసార్లు ట్యూమర్స్ ఏర్పడతాయి. గొంతు భాగంలో వాపు/ గడ్డ ఏర్పడినట్లు కనిపిస్తుంది. ఈ వాపు అనేది ఆహారం తీసుకునేటప్పుడు లేదా మింగేటప్పుడు పైకీ కిందకీ కదులుతుంది. కానీ ఎటువంటి నొప్పి, ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. కణితి పరిమాణం పెరిగినప్పుడు ఆహారం తీసుకుంటుంటే పట్టేసినట్లుగా అనిపిస్తుంది.
News December 4, 2025
థైరాయిడ్ ట్యూమర్స్ చికిత్స

థైరాయిడ్ ట్యూమర్స్ వచ్చినప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి ఏ రకమైన కణితో తెలుసుకుంటారు. అలా తెలియకపోతే నీడిల్ ద్వారా కణితిలోని కొన్ని కణాలను బయటికి తీసి, మైక్రోస్కోప్లో పరీక్షిస్తారు. థైరాయిడ్ కణితి 3 సెం.మీ. కన్నా పెద్దగా ఉండి, ఆహారం తీసుకున్నప్పుడు ఇబ్బందికరంగా ఉంటే సాధారణంగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్/ సర్జికల్ ట్రీట్మెంట్ చేస్తారు.
News December 4, 2025
పుతిన్ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నారు: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ మధ్య పీస్ ప్లాన్పై నిన్న రష్యాలో అమెరికా ప్రతినిధి బృందం చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పుతిన్ యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నారని US అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ‘పుతిన్తో జారెడ్ కుష్నెర్, స్టీవ్ విట్కాఫ్ సమావేశం బాగా జరిగింది. అయితే ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది. పుతిన్ యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నట్లు వారిద్దరూ అభిప్రాయపడ్డారు’ అని అన్నారు.


