News November 18, 2024
తాను చనిపోయినా.. నలుగురికి ప్రాణం పోసిన రెండేళ్ల బాలుడు

కెన్యాకు చెందిన రెండేళ్ల లుండా యుంబా చనిపోతూ భారత్లోని నలుగురికి ప్రాణం పోశారు. రెండో అంతస్తు నుంచి పడిపోవడంతో లుండా తలకు గాయం అయింది. చికిత్స పొందుతూ అక్టోబర్ 26న బ్రెయిన్ డెడ్తో మృతి చెందారు. దీంతో అతని అవయవాలు దానం చేసేందుకు లుండా తల్లి ముందుకొచ్చారు. ఇండియాలో పాంక్రియాస్ గ్రంథి దానం చేసిన అత్యంత పిన్న వయస్కుడు లుండానే. చండీగఢ్లోని PGI ఆస్పత్రి వైద్యులు లుండాకు ఘన నివాళులర్పించారు.
Similar News
News November 12, 2025
రోహిత్ టార్గెట్.. ఫిట్నెస్, 2027 వరల్డ్ కప్!

2027 ODI వరల్డ్ కప్ టీమ్లో చోటు దక్కించుకోవాలని రోహిత్ శర్మ గట్టి పట్టుదలతో ఉన్నారు. డిసెంబర్ 24 నుంచి జరిగే విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున ఆడనున్నట్టు ప్రకటించడం అందుకేనని విశ్లేషకులు చెబుతున్నారు. వన్డే స్క్వాడ్లో చోటు దక్కాలంటే డొమెస్టిక్ క్రికెట్ తప్పక ఆడాల్సిందేనని BCCI రూల్ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే బరువు తగ్గిన హిట్మ్యాన్.. ప్రపంచకప్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
News November 12, 2025
ఐరన్, క్యాల్షియం ట్యాబ్లెట్లు ఎలా తీసుకోవాలంటే?

హిమోగ్లోబిన్ తయారీలో ఐరన్, ఎముకలు బలంగా ఉండటానికి క్యాల్షియం అత్యవసరం. అందుకే గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు, నెలసరి నిలిచిన మహిళలు వీటిని తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. అయితే ఈ రెండిటినీ ఒకేసారి తీసుకుంటే శరీరం ఐరన్ను గ్రహించుకోకుండా క్యాల్షియం అడ్డుపడుతుంది. ఐరన్ పరగడుపున బాగా ఒంట పడుతుంది కాబట్టి భోజనానికి ముందు తీసుకుంటే మంచిది. క్యాల్షియాన్ని భోజనంతో పాటు తీసుకోవచ్చు.
News November 12, 2025
వారితో మాకు సంబంధం లేదు: అల్ ఫలాహ్ యూనివర్సిటీ

ఢిల్లీ <<18265346>>ఎర్రకోట <<>>వద్ద పేలుడు కేసులో ప్రధాన నిందితులు అల్ ఫలాహ్ వర్సిటీ డాక్టర్లేనని అనుమానిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని వర్సిటీ VC భూపిందర్ కౌర్ తెలిపారు. డాక్టర్లు ముజామిల్, షాహీన్తో తమకు సంబంధం లేదన్నారు. ‘మేం ఎలాంటి రసాయనాలు నిల్వ చేయట్లేదు. ఉపయోగించట్లేదు. స్టూడెంట్ల అకడమిక్, ట్రైనింగ్ కోసం అవసరమైనంత వాడుతున్నాం’ అని పేర్కొన్నారు.


