News July 1, 2024
రాష్ట్రపతి ప్రసంగంపై నేడు ధన్యవాద తీర్మానం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719802062265-normal-WIFI.webp)
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. దీనిపై చర్చకు లోక్సభలో కేంద్రం 16 గంటల సమయాన్ని కేటాయించింది. మరోవైపు ఇదే సమయంలో నీట్ పేపర్ లీకేజీ, నిరుద్యోగం, అగ్నిపథ్, ద్రవ్యోల్బణం వంటి అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News February 11, 2025
ఐదేళ్ల విధ్వంసంతో వెనకబడ్డాం: CM చంద్రబాబు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739252162861_782-normal-WIFI.webp)
AP: గత ఐదేళ్ల విధ్వంసంతో చాలా వెనకబడిపోయామని సీఎం చంద్రబాబు అన్నారు. సమర్థ నాయకత్వం ఉంటే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ ఉన్నామన్నారు. ‘సంపద సృష్టించాలి.. పేదలకు పంచాలి. ఆరు నెలల పాలనలో 12.94% వృద్ధిరేటు కనబడింది. ఫైళ్ల పరిశీలన వేగం పెంచాలి. సమస్య వచ్చిన వెంటనే పరిష్కరిస్తే మంచి ఫలితాలు వస్తాయి’ అని సచివాలయంలో మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో CM అన్నారు.
News February 11, 2025
రోహిత్లాగే కోహ్లీ ఫామ్లోకి వస్తారు: మురళీధరన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1738006094635_1032-normal-WIFI.webp)
రోహిత్ శర్మలానే విరాట్ కోహ్లీ కూడా ఫామ్ అందుకుంటారని శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అభిప్రాయపడ్డారు. వీరిద్దరూ ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగితే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. ‘ప్రస్తుతం రోహిత్ సేన అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉంది. భారత్తోపాటు పాక్, బంగ్లా, అఫ్గాన్లో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. వీరికి పాకిస్థాన్ పిచ్లు బాగా సహకరిస్తాయి’ అని ఆయన పేర్కొన్నారు.
News February 11, 2025
2029 కల్లా 63లక్షల ఎయిడ్స్ మరణాలు: ఐరాస
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739247663905_782-normal-WIFI.webp)
ఎయిడ్స్ నియంత్రణకు ఏటా US ఇచ్చే రూ.3,83,160కోట్ల సాయాన్ని ట్రంప్ నిలిపేయడంపై ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో కొత్త HIV కేసులు 6 రెట్లు పెరుగుతాయని చెప్పింది. 2029 కల్లా 63 లక్షల ఎయిడ్స్ మరణాలు సంభవిస్తాయంది. 2023లో కొత్తగా 13 లక్షల కేసులు మాత్రమే నమోదయ్యాయని, ట్రంప్ నిర్ణయంతో ఇప్పటి వరకు 160 దేశాల్లో వచ్చిన ఫలితాలు వృథా అవుతాయంది. ఇథియోపియా, ఉగాండా, మొజాంబిక్ దేశాల్లో ఎయిడ్స్ కేసులు ఎక్కువ.