News March 20, 2024
వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఆర్ఎస్ ప్రవీణ్
TG: రాష్ట్రంలో ప్రస్తుతం గ్యారంటీల గారడీ మాత్రమే నడుస్తున్నదని బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాలుగు నెలల్లోనే రూ.16,400 కోట్ల అప్పు చేసినట్లుగా వార్తలొస్తున్నాయని పేర్కొన్నారు. అనధికారికంగా కార్పొరేషన్ల పేరు మీద చేసే అప్పులు దీనికి రెండింతలు ఉంటాయని తెలిపారు. ఈ నాలుగు నెలల్లో కాంగ్రెస్ చేసిన అప్పుల మీద శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News October 1, 2024
3న ఓటీటీలోకి ‘ది గోట్’ మూవీ
వెంకట్ ప్రభు డైరెక్షన్లో దళపతి విజయ్ నటించిన ది గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) మూవీ ఈ నెల 3న ఓటీటీలోకి రానుంది. నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. గత నెల 5న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ రూ.450 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాలో స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, జయరాం, ప్రభుదేవా కీలక పాత్రల్లో నటించారు.
News October 1, 2024
రాహుల్గాంధీ సిటిజన్షిప్ PIL: టైమ్ కావాలన్న కేంద్రం
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వం రద్దుపై తమకు అభ్యర్థన అందిందని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై చర్యలు తీసుకొనేందుకు కాస్త సమయం కావాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్కు తెలిపింది. రాహుల్కు బ్రిటన్ పౌరసత్వం ఎలా వచ్చిందో, తర్వాత ఆ డాక్యుమెంటును ఎందుకు క్యాన్సిల్ చేశారో సీబీఐతో దర్యాప్తు చేయించాలని కర్ణాటక బీజేపీ కార్యకర్త విఘ్నేశ్ శిశిర్ హైకోర్టులో వేసిన పిల్కు వివరణ ఇచ్చింది.
News October 1, 2024
డిసెంబర్ 25న ‘గేమ్ ఛేంజర్’ విడుదల: దిల్ రాజు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదలపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 25న గ్రాండ్గా రిలీజ్ చేస్తామని ‘రా మచ్చా మచ్చా’ ఈవెంట్లో ఆయన ప్రకటించారు. అయితే, గతంలో డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేయగా వరుస సెలవులు ఉండటంతో క్రిస్మస్కి ప్లాన్ చేశారు. కాగా, సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ కానుంది.