News October 7, 2024

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధానికి ఏడాది

image

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధానికి ఏడాది పూర్తి అయింది. 2023, అక్టోబర్ 7న హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. పిల్లలు, యువతుల్ని బందీలుగా తీసుకెళ్లడంతో పాలస్తీనాలో IDF ఏరివేత మొదలు పెట్టింది. దీంతో లక్షలాది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. మధ్యలో బందీలను ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నా హెజ్బొల్లా దూరడంతో వివాదం మరో టర్న్ తీసుకుంది. ఇప్పుడు ఇరాన్‌తో ప్రత్యక్ష యుద్ధం స్థాయికి చేరింది.

Similar News

News November 4, 2025

చంద్రబాబు, లోకేశ్‌పై జగన్ సెటైర్లు

image

AP: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా CM చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై YCP అధినేత జగన్ సెటైర్లు వేశారు. ‘ఇంత విపత్కర పరిస్థితిలో సీఎం ఒక రోజు వస్తాడు. అలా చాపర్‌లో తిరుగుతాడు. మరుసటి రోజు లండన్‌కు పోతాడు. ఆయన కొడుకు ఆస్ట్రేలియా నుంచి వస్తాడు. మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడటానికి పోతాడు’ అని ఎద్దేవా చేశారు. రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

News November 4, 2025

రేపు పలు జిల్లాలకు వర్షసూచన

image

AP: కోస్తా తీరానికి ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీంతో రేపు కోనసీమ, కృష్ణా, GNT, బాపట్ల, ప్రకాశం, NLR, కర్నూలు, KDP, TPT జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వానలకు ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. ఇవాళ 5PM వరకు బాపట్లలో 61.5MM, నంద్యాల(D) నందికొట్కూరులో 51.7MM అధిక వర్షపాతం నమోదైనట్లు చెప్పింది.

News November 4, 2025

ఇక ఎందులో ప్రయాణించాలి?

image

ఇటీవల పలు బస్సు ప్రమాదాలు ప్రజల్లో భయాన్ని నింపాయి. స్లీపర్ బస్సుల వైపు అయితే కొంతకాలం చూడకూడదనే పరిస్థితి తెచ్చాయి. బస్సులెందుకు ట్రైన్లలో వెళ్దామనుకుంటే ఇవాళ ఛత్తీస్‌గఢ్‌ రైలు ప్రమాదం డైలమాలోకి నెట్టింది. ఇక ఎందులో ప్రయాణించాలి? అనే చర్చ ఏ ఇద్దరు కలిసినా విన్పిస్తోంది. అయితే వాహనం ఏదైనా యాక్సిడెంట్లు జరగొచ్చని, వాటి నియంత్రణకు ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.