News March 17, 2024
గడ్డి మందు తాగి యువకుడు సూసైడ్

గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని బుజ్జిలాపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వేమూరు మైపాల్ రెడ్డి అనే యువకుడు ఫిట్స్ వ్యాధితో బాధపడుతూ మనస్థాపానికి గురై శుక్రవారం గడ్డి మందు తాగడంతో గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. శనివారం సాయంత్రం యువకుడు మరణించాడు
Similar News
News March 19, 2026
నల్గొండ: జాతీయ ఫుట్బాల్లో తేజు ప్రతిభ

హాలియాకు చెందిన చింతలచెరువు తేజు జాతీయ స్థాయి ఫుట్బాల్లో ప్రతిభ చాటుతున్నాడు. చిన్న వయసులోనే క్రమశిక్షణతో సాధన చేస్తూ ముందుకు సాగుతున్నాడు. హరియాణాలో జరిగిన అండర్-17 జాతీయ చాంపియన్షిప్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. స్థానికులు తేజును అభినందిస్తున్నారు. భవిష్యత్తులో మరింత రాణించాలని ఆశిస్తున్నారు.
News March 19, 2026
నల్గొండ జిల్లా రికార్డు సృష్టించింది

నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పరుగులు పెడుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన ప్రగతి నివేదిక’ 99 రోజుల లక్ష్యంలో భాగంగా, జూన్ 12 నాటికి 6,409 గృహాలను పూర్తి చేయాలని అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో అత్యధిక ఇళ్లను నిర్మించిన జిల్లాల్లో రెండో స్థానాన్ని దక్కించుకుని NLG రికార్డు సృష్టించింది. ఇప్పటికే 1809 గృహాలు గృహ ప్రవేశాలకు సిద్ధమయ్యాయి.
News March 19, 2026
నల్గొండ: ఓటరు జాబితా సవరణకు సహకరించండి: కలెక్టర్

జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ కోరారు. బుధవారం తన ఛాంబర్లో జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో చేపట్టనున్న ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SSR) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.


