News January 21, 2025

A2 నిందితుడికి ప్రజా సొమ్ము ఎలా ఇస్తారు: బొత్స

image

రామతీర్థం బోడికొండపై కోదండ రాముని విగ్రహ ధ్వంసం కేసులో A2 నిందితుడిగా ఉన్న వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 5లక్షలు ఎలా ఇస్తారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విజయనగరంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఆ ఘటనలో నష్టం జరిగిందని బాధితుడికి ప్రజల సొమ్ము ఇవ్వడమేమిటన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఘటనపై దర్యాప్తు చేయాలన్నారు.

Similar News

News October 29, 2025

రేషన్ సరకుల పంపిణీ శతశాతం పూర్తి కావాలి: VZM కలెక్టర్

image

రేష‌న్ పంపిణీ బుధవారం లోగా శ‌త‌శాతం పూర్తి కావాల‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి ఆదేశించారు. అధికారులతో మంగళవారం రాత్రి జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. న‌వంబ‌రు నెల రేష‌న్ స‌రకుల పంపిణీని ముందుగానే చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింద‌ని, ఇప్ప‌టికే జిల్లాలో పంపిణీ మొద‌ల‌య్యింద‌ని చెప్పారు. బుధ‌వారం నాటికి అన్ని గ్రామాల్లో శ‌త‌శాతం పూర్తి చేయాల‌ని ఆదేశించారు.

News October 29, 2025

విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు: జడ్పీ ఛైర్మన్

image

గుర్ల కేజీబీవీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. సమాచారం తెలుసుకున్న జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు నెల్లిమర్ల ప్రభుత్వాసుపత్రి వైద్యులతో ఫోన్‌లో మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఐదుగురు విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని చిన్న శ్రీను విజ్ఞప్తి చేశారు.

News October 28, 2025

VZM: ‘24 గంటలు విధుల్లో ఉండాలి’

image

మొంథా తుఫానును దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన 71 పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులను కల్పించాలని జిల్లా తుఫాను ప్రత్యేకాధికారి రవి సుభాష్ పట్టంశెట్టి ఆదేశించారు. కాల్ సెంటర్లతో పాటు సచివాలయాలు, పునరావాస కేంద్రాల్లో కూడా ప్రభుత్వ సిబ్బంది షిఫ్టులవారీగా 24 గంటలు విధులను నిర్వహించాలని స్పష్టం చేశారు. రేషన్ సరకులు, తాగునీరు, మందులు, ఇతర వస్తువులును సిద్ధంగా ఉంచాలన్నారు.