News February 6, 2025
ప్రైవేటు కంపెనీలకూ ఆధార్ అథెంటికేషన్ సేవలు

కేంద్ర ప్రభుత్వం ఆధార్ అథెంటికేషన్ సేవలను ప్రైవేటు సంస్థలకూ విస్తరించింది. ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం డిజిటల్ KYCని ఉపయోగించుకొనేందుకు అనుమతించింది. 2025, JAN 31 నుంచే ప్రభుత్వేతర సంస్థలు ఈ సేవలకు దరఖాస్తు చేసుకొనే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇది BFSI సెక్టార్లో ఓ గేమ్ఛేంజర్ అని UIDAI DyDG మనీశ్ భరద్వాజ్ తెలిపారు. 2010 నుంచి తాము 14000 కోట్ల అథెంటికేషన్ లావాదేవీలను ప్రాసెస్ చేసినట్టు తెలిపారు.
Similar News
News December 10, 2025
న్యాయ వ్యవస్థను బెదిరిస్తారా: పవన్ కళ్యాణ్

DMK ఆధ్వర్యంలోని ఇండీ కూటమి MPలు మద్రాస్ హైకోర్టు జడ్జిపై అభిశంసన నోటీసు ఇవ్వడాన్ని AP Dy.CM పవన్ ఖండించారు. “ఇది న్యాయవ్యవస్థ మొత్తాన్ని భయపెట్టే యత్నం కాదా? ఇలాంటప్పుడు భక్తులు తమ ఆలయాలను, మత వ్యవహారాలను స్వతంత్రంగా నిర్వహించేందుకు, రాజకీయ ద్వేషంతో ప్రేరితమైన న్యాయ దుర్వినియోగాలకు గురవకుండా ఉండేందుకు ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ ఏర్పాటు దేశానికి అత్యవసరం” అని <
News December 9, 2025
OFFICIAL: ‘అఖండ-2’ రిలీజ్ డేట్ ఇదే

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ-2’ సినిమాను ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. 11న ప్రీమియర్లు ఉంటాయని, త్వరలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయని తెలిపింది. ఈ నెల 5న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఫైనాన్షియల్ వివాదాల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా వివాదాలు <<18513521>>పరిష్కారమవడంతో<<>> మూవీ రిలీజ్కు అడ్డంకులన్నీ తొలగిపోయాయి.
News December 9, 2025
రూ.40వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయండి: CBN

AP: పూర్వోదయ స్కీమ్లో భాగంగా ₹40 వేల కోట్లతో వివిధ ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని CBN అధికారులకు సూచించారు. ₹20 వేల కోట్ల చొప్పున నిధులతో సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతులు కల్పించాలన్నారు. ప్రకాశం, రాయలసీమలో 20L ఎకరాల్లో ఉద్యాన పంటల్ని విస్తరించాలని చెప్పారు. ₹58,700 CRతో చేపట్టే పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుతో 200 TMCల గోదావరి నీటిని వినియోగించే అవకాశం ఉంటుందన్నారు.


