News March 25, 2025

నేటి నుంచే ఆధార్ నమోదు శిబిరాలు

image

AP: రాష్ట్రంలో రెండో విడత ఆధార్ నమోదు క్యాంపులు నేటి నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 6సంవత్సరాలలోపు చిన్నారులు డేట్‌ ఆఫ్‌ బర్త్ సర్టిఫికెట్ ఆధారంగా నమోదు చేసుకోవచ్చు. ఆధార్ అప్‌డేట్ సైతం ఈ కేంద్రాల వద్ద చేసుకోవచ్చు. ఈ మేరకు అధికారులు గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆధార్ నమోదు చేసుకోని పిల్లల సంఖ్య 1,86,709 ఉన్నట్లు గుర్తించారు.

Similar News

News January 20, 2026

LRS.. 4 రోజులే గడువు

image

AP: అనుమతి లేని ప్లాట్ల క్రమబద్ధీకరణకు 4 రోజులే అవకాశం ఉంది. LRSకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఈ నెల 23 వరకు గడువు విధించింది. రాష్ట్రంలో 9 వేల ఎకరాల మేర అనధికార లేఅవుట్లు ఉన్నట్లు అధికారుల అంచనా. ఇప్పటిదాకా 6 వేల ఎకరాల్లోని ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం 52 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. మరో 25 వేల అప్లికేషన్లు రావొచ్చని తెలుస్తోంది. కాగా గడువు పొడిగించాలని ప్రజల నుంచి వినతులు వస్తున్నాయి.

News January 20, 2026

BJP కొత్త బాస్‌కు అగ్నిపరీక్షగా 5 రాష్ట్రాల ఎన్నికలు!

image

BJP నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు పరీక్షగా మారనున్నాయి. WB, కేరళ, TN, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా ఎదుర్కోవడం ఆయన ముందున్న సవాల్. ముఖ్యంగా షా, నడ్డా హయాంలో పార్టీ సాధించిన విజయాల పరంపరను నిలబెట్టడం నబీన్‌కు అగ్నిపరీక్షే. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడం, బెంగాల్‌లో అధికారం దిశగా అడుగులు వేయడంపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంది!

News January 20, 2026

ఇన్‌స్ట్రుమెంటేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు

image

<>కేరళలోని <<>>ఇన్‌స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ 81 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల డిప్లొమా, డిగ్రీ(ఇంజినీరింగ్) అభ్యర్థులు ఫిబ్రవరి 9 వరకు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.12,300, డిప్లొమా హోల్డర్లకు రూ.10,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ilpgt.com