News June 14, 2024

ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు పెంపు

image

ఆధార్‌ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గతంలో నిర్ణయించిన గడువు నేటితో ముగియాల్సి ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్ 14వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్‌డేట్ చేసుకునేందుకు UIDAI <>వెబ్‌సైట్‌లో<<>> ఆధార్ నంబర్, క్యాప్చా, ఓటీపీతో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

Similar News

News October 11, 2025

విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు

image

AP: విజయవాడ, సింగపూర్ మధ్య నవంబర్ 15 నుంచి ఇండిగో సంస్థ విమాన సర్వీసులను ప్రారంభించనుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వారానికి మూడు రోజులు (మంగళ, గురు, శని వారాల్లో) సర్వీసులు ఉంటాయని వివరించారు. విజయవాడ నుంచి సింగపూర్ ఛాంగీ విమానాశ్రయానికి ఈ సర్వీసులు ఉంటాయని చెప్పారు. భవిష్యత్తులో కోటికి పైగా ప్రవాసాంధ్రులు ప్రయాణించే అవకాశం ఉందన్నారు.

News October 11, 2025

2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI

image

AI టెక్నాలజీ కోసం ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఇక మనదేశానికి ఉండదు. ఎందుకంటే స్వదేశీ AI 2026 ఫిబ్రవరిలో లాంచ్ కానుంది. ఈ ఏడాది చివరికి మన సొంత ఏఐ సాంకేతికత పూర్తవుతుందని, ఆపై అందుబాటులోకి వస్తుందని MeitY సెక్రటరీ కృష్ణన్ తెలిపారు. ‘38వేల గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ (GPU)తో ఉండే ఈ ఏఐతో కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో మెరుగుపడుతుంది. ఇండియా సెమికండక్టర్ మిషన్ 2.0లో ఇది కీలకమవుతుంది’ అని తెలిపారు.

News October 11, 2025

భారతదేశపు మొట్టమొదటి మిసెస్ యూనివర్స్‌గా షెర్రీ సింగ్

image

ఫిలిప్పీన్స్‌లో జరిగిన మిసెస్ యూనివర్స్‌ 2025 పోటీల్లో INDకి చెందిన షెర్రీసింగ్ విజయం సాధించారు. ఈ పేజెంట్‌లో మన దేశానికి తొలికిరీటం తెచ్చి షెర్రీ చరిత్ర సృష్టించారు. నోయిడాలో జన్మించిన షెర్రీ ఫ్యాషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఉమెన్ ఎంపవర్‌మెంట్, మెంటల్ హెల్త్‌పై ఆమె అవగాహన కల్పిస్తున్నారు. ‘ఈ విజయం నాది మాత్రమే కాదు. కలలు కనే ధైర్యం చేసిన ప్రతి స్త్రీకి చెందుతుంది.’ అని షెర్రీ అన్నారు.