News June 14, 2024

ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు పెంపు

image

ఆధార్‌ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గతంలో నిర్ణయించిన గడువు నేటితో ముగియాల్సి ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్ 14వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్‌డేట్ చేసుకునేందుకు UIDAI <>వెబ్‌సైట్‌లో<<>> ఆధార్ నంబర్, క్యాప్చా, ఓటీపీతో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

Similar News

News October 7, 2025

ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్

image

ఫిజిక్స్‌లో ముగ్గురు సైంటిస్టులకు నోబెల్-2025 బహుమతి దక్కింది. జాన్ క్లార్క్, మైకేల్ డెవోరెట్, జాన్ మార్టినిస్‌ను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. ‘మైక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్, ఎనర్జీ క్వాంటైజేషన్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్’ కనుగొన్నందుకు వారికి నోబెల్ దక్కింది.

News October 7, 2025

ఇది BJP, BRS కుట్ర: పొన్నం

image

TG: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌తో <<17937013>>వివాదంపై<<>> మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. తాను ఎవరినీ ఏమీ అనలేదని, తన మాటలను వక్రీకరించారని మీడియాతో అన్నారు. ఇది బీఆర్ఎస్, బీజేపీ కుట్ర అని ఆరోపించారు. దీనిపై అధిష్ఠానం దృష్టి సారించిందని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో మాట్లాడినట్లు చెప్పారు.

News October 7, 2025

‘కాళేశ్వరం’ రిపోర్టు.. హైకోర్టులో విచారణ వాయిదా

image

TG: కాళేశ్వరం కమిషన్ నివేదికపై దాఖలైన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దంటూ మాజీ సీఎం KCR, హరీశ్ రావు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఇటీవల ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం ఇవాళ 2 వారాల గడువు కోరింది. దీంతో తదుపరి విచారణను వచ్చే నెల 12కి కోర్టు వాయిదా వేసింది.