News June 14, 2024

ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు పెంపు

image

ఆధార్‌ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గతంలో నిర్ణయించిన గడువు నేటితో ముగియాల్సి ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్ 14వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్‌డేట్ చేసుకునేందుకు UIDAI <>వెబ్‌సైట్‌లో<<>> ఆధార్ నంబర్, క్యాప్చా, ఓటీపీతో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

Similar News

News October 12, 2025

మా పార్టీ వాళ్లనూ సస్పెండ్ చేశాం: చంద్రబాబు

image

AP: కొందరు రాజకీయ ముసుగులో నేరాలు చేయడానికి అలవాటు పడ్డారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ‘నకిలీ మద్యం కేసులో మా పార్టీ వాళ్లపై ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేశాం. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటివరకు 23 మంది నిందితులను గుర్తించాం. 16 మందిని అరెస్ట్ చేశాం. ఇబ్రహీంపట్నం కేసులోనూ 12 మంది నిందితులను గుర్తించగా ఏడుగురిని అరెస్టు చేశారు. 4 పీటీ వారెంట్‌లు నమోదయ్యాయి’ అని సీఎం వివరించారు.

News October 12, 2025

బెల్ట్ షాపులు నిర్వహిస్తే బెల్ట్ తీస్తాం: చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో ఎక్కడైనా బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మితే బెల్ట్ తీస్తామని CM CBN హెచ్చరించారు. నకిలీ మద్యం కేసుకు సంబంధించి నెల్లూరు రేంజ్ IG అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశామన్నారు. వ్యాపారం పేరుతో నకిలీ మద్యం తయారు చేస్తామంటే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు కల్తీ మద్యాన్ని గుర్తించేందుకు ‘AP ఎక్సైజ్ సురక్షా యాప్‌’ను రిలీజ్ చేశారు. యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా యాప్‌ను తీర్చిదిద్దామన్నారు.

News October 12, 2025

వేరుశనగలో ఇనుపధాతులోపం.. నివారణ

image

ఆకులలో పత్రహరితం తయారవడానికి ఇనుపధాతు కీలకం. ఇది లోపించినప్పుడు వేరుశనగ మొక్క ఆకులు పసుపు రంగుకు మారతాయి. క్రమంగా ఆకు కొనలు ఎండిపోతాయి. మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. ఈ సమస్య నివారణకు 0.5 శాతంఅన్నబేధి(5గ్రా. లీటరు నీటికి), 0.1 శాతం నిమ్మఉప్పు(లీటరు నీటికి 1గ్రాము) కలిపిన ద్రావణాన్ని 4-5 రోజుల వ్యవధిలో 2-3సార్లు పిచికారీ చేసుకోవాలి.