News June 14, 2024
ఆధార్ ఉచిత అప్డేట్ గడువు పెంపు

ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గతంలో నిర్ణయించిన గడువు నేటితో ముగియాల్సి ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్ 14వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్డేట్ చేసుకునేందుకు UIDAI <
Similar News
News October 7, 2025
బెంగాల్లో BJP లీడర్లపై దాడి.. మోదీ వ్యాఖ్యలపై దీదీ అభ్యంతరం

బెంగాల్లో BJP MP, MLAఫై <<17928525>>దాడి<<>> జరిగిన ఘటన ఆ రాష్ట్రంలోని శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని PM మోదీ అన్నారు. TMC ప్రభుత్వం హింసపై కాకుండా ప్రజా సేవపై దృష్టి పెట్టాలన్నారు. మోదీ వ్యాఖ్యలపై సీఎం మమత స్పందిస్తూ ‘దీనిని రాజకీయం చేయొద్దు. PM అయ్యుండి బీజేపీ నేతగా మాట్లాడటం సరికాదు. BJP లీడర్లు వచ్చే ముందు లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. అలాంటప్పుడు మమ్మల్ని ఎలా నిందిస్తారు’ అని ప్రశ్నించారు.
News October 7, 2025
మరోసారి టారిఫ్స్ బాంబు పేల్చిన ట్రంప్

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి టారిఫ్స్ బాంబు పేల్చారు. ఇతర దేశాల నుంచి USలోకి వచ్చే అన్ని మీడియం, హెవీ డ్యూటీ ట్రక్కులపై 25% టారిఫ్ విధించనున్నట్లు ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఇది ఈ ఏడాది నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి టారిఫ్ల మోత కొనసాగిస్తున్నారు. ఇప్పటికే భారత్ సహా పలు దేశాలపై అడిషనల్ టారిఫ్స్ విధించిన సంగతి తెలిసిందే.
News October 7, 2025
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చిత్తశుద్ధితో ఉన్నాం: CM చంద్రబాబు

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ పటిష్టతకు, పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని CM చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ఏడాది కాలంలో కేంద్ర సాయం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్లాంట్ ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి వచ్చింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ప్లాంట్ను నష్టాల నుంచి బయట పడేయడానికి, బలోపేతం చేయడానికి యాజమాన్యం, కార్మికులు, ఉద్యోగులు, ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి’ అని అధికారులతో సమీక్షలో వ్యాఖ్యానించారు.