News May 19, 2024
బీజేపీ ఆఫీస్ ముట్టడికి ఆప్ పిలుపు.. ఢిల్లీలో హైటెన్షన్

ఢిల్లీలో బీజేపీ ఆఫీస్ ముట్టడికి ఆప్ నేతలు సిద్ధమయ్యారు. CM కేజ్రీవాల్ మాజీ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆ పార్టీ నిరసనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. కాసేపట్లో ఆప్ నేతలు కమలం పార్టీ ఆఫీసుకు ర్యాలీగా బయల్దేరనున్నారు. దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
Similar News
News December 27, 2025
క్యాబేజీ సాగు – యాజమాన్య పద్ధతులు

శీతాకాలంలో సాగు చేసే పంటల్లో క్యాబేజీ ఒకటి. కొద్దిపాటి నీటి సౌకర్యం ఉన్న భూముల్లో కూడా ఈ పంటను సాగుచేసి మంచి లాభాలు పొందవచ్చు. ఇసుకతో కూడిన బంక నేలలు, సారవంతమైన ఒండ్రు నేలలు ఈ పంటకు అనుకూలం. వీటిలో దీర్ఘకాలిక రకాలను డిసెంబరు నెలాఖరు వరకు నాటుకోవచ్చు. ఎకరానికి సూటి రకాలు 300 గ్రా., హైబ్రిడ్ రకాలు 100-150 గ్రా. విత్తనాలు సరిపోతాయి. కిలో విత్తనానికి 3 గ్రా. థైరామ్ను కలిపి విత్తన శుద్ధిచేయాలి.
News December 27, 2025
శివాజీపై పోరాటం.. అనసూయకు ప్రకాశ్ రాజ్ మద్దతు

కొన్నిరోజులుగా శివాజీ-<<18671913>>అనసూయ<<>> మధ్య SM వేదికగా కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇందులోకి ప్రకాశ్ రాజ్ ఎంట్రీ ఇచ్చారు. ‘సంస్కారులమని చెప్పుకునే వారిని మొరగనివ్వు. అది వాళ్ల కుంచిత మనస్తత్వం. మేమంతా నీతోనే ఉన్నాం’ అని ట్వీట్ చేశారు. MLC <<18683153>>నాగబాబు<<>> కూడా శివాజీ వ్యాఖ్యలను ఖండించిన విషయం తెలిసిందే. ‘మా బాబుగారు ఎప్పుడూ మావైపే’ అంటూ అనసూయ థాంక్స్ చెప్పారు.
News December 27, 2025
గ్రామ, వార్డు సచివాలయాల ప్రక్షాళన!

AP: ఎక్కడికి వెళ్తారో.. ఎప్పుడు వస్తారో తెలియదు. ఇదీ గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది తీరు. ఇటీవల కలెక్టర్ల భేటీలో CM దీనిపై సీరియస్ అవడంతో అధికారులు ప్రక్షాళన చేపట్టారు. ఇతర శాఖలకు డిప్యుటేషన్లను రద్దు చేశారు. ఇకపై సిబ్బంది రోజూ ఆఫీసుకు హాజరవ్వాలి. ఏ పని అయినా పై అధికారి ముందస్తు అనుమతితో బయటకు వెళ్లాలి. అక్కడి నుంచే యాప్లో హాజరు వేయాలి. పర్యవేక్షణకు వివిధ స్థాయుల అధికారుల్ని నియమిస్తున్నారు.


