News May 20, 2024
AAPకి విదేశాల నుంచి ₹7.08కోట్లు: ED

కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ విదేశీ నిధుల సేకరణలో అక్రమాలకు పాల్పడిందని ఈడీ ఆరోపించింది. 2014-2022 మధ్య US, కెనడా, ఆస్ట్రేలియాతో సహా పలు దేశాల నుంచి ₹7.08కోట్లు పొందిందని పేర్కొంది. దాతల వివరాలను అకౌంట్స్ బుక్లో చూపించకుండా దాచిపెట్టిందని తెలిపింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను AAP ఉల్లంఘించిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలిపింది.
Similar News
News December 6, 2025
మీ పిల్లలు చేసే ఈ పనులను సరిదిద్దండి

పిల్లలు చేసే కొన్ని పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి. కానీ అవే భవిష్యత్లో సమస్యలుగా మారే ప్రమాదముంది. పెద్దలు మాట్లాడేటప్పుడు అడ్డుకోవడం, ఏదైనా షేర్ చేసుకోకుండా మొండిగా ఉండటం, అబద్ధాలు చెప్పడం, దుకాణాల్లో మారాం చేయడం.. ఇవన్నీ చిన్న వయసులోనే మార్చాల్సిన అలవాట్లు. ఎక్కువ సమయం ఫోన్ చూడటం, మాట వినకపోవడం వంటి ప్రవర్తనలు కూడా వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతాయి. మృదువైన హెచ్చరికతో పిల్లలను సరిదిద్దాలి.
News December 6, 2025
ECIL హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని<
News December 6, 2025
నాణ్యమైన బొగ్గురాక విద్యుదుత్పత్తిలో సమస్య

TG: నాణ్యమైన బొగ్గురాక డిమాండ్కు తగ్గ విద్యుదుత్పత్తిలో జెన్కో సమస్య ఎదుర్కొంటోంది. నాసిరకం బొగ్గువల్ల థర్మల్ ప్లాంట్ల యంత్రాలూ దెబ్బతింటున్నాయి. ఇది సరఫరాపై ప్రభావం చూపి బయటి నుంచి అధిక ధరకు కొనే పరిస్థిితి వస్తోంది. దీంతో క్వాలిటీ కోల్ కోసం సింగరేణికి లేఖ రాసింది. బకాయిపడ్డ ₹15000 CR అంశాన్నీ పరిష్కరించింది. క్వాలిటీ బొగ్గు సరఫరాకు అంగీకారం కుదుర్చుకుంది. ఇక నిర్ణీత 4200mw ఉత్పత్తి చేయనుంది.


