News June 1, 2024

AARA SURVEY: సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి BJPవే..!

image

సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాలు BJPవే అని ఆరా మస్తాన్ సర్వే తేల్చి చెప్పింది. చేవెళ్లలో BRS నుంచి కాసాని, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, BJP నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేశారు. మల్కాజిగిరిలో BRSనుంచి రాగిడి, కాంగ్రెస్ నుంచి సునీత, BJPనుంచి ఈటల పోటీలో ఉన్నారు. సికింద్రాబాద్‌లో BRS నుంచి పద్మారావు, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, BJPనుంచి కిషన్ రెడ్డి పోటీలో ఉన్నారు.

Similar News

News September 30, 2024

HYD: మార్పు చెందకపోతే మనుగడ కష్టమే: ఇస్రో ఛైర్మన్

image

HYD బాలనగర్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(NRSC) ప్రపంచ వ్యాప్తంగా అనేక సేవలు అందించినట్లు ISRO ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తోన్న మార్పులకు అనుగుణంగా మారకపోతే రిమోట్ సెన్సింగ్ మనుగడ కష్టమేనన్నారు. సాంకేతికతలో వేగంగా మార్పులు వస్తున్నాయని, సమాచారం అత్యంత వేగంగా కావాలని ప్రజలు, వ్యవస్థలు కోరుకుంటున్నాయన్నారు. రాబోయే 25 ఏళ్లకు వచ్చే మార్పులను అంచనా వేసి నివేదిక రూపొందించాలన్నారు.

News September 30, 2024

BREAKING: HYD: కాసేపట్లో DSC ఫలితాలు విడుదల

image

DSC ఫలితాలు మరికొద్ది క్షణాల్లో విడుదల కానున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 2 నెలల క్రితం పూర్తయిన DSC పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు. కాగా, 11,062 పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.

News September 30, 2024

HYD: సామాన్యుడి బతుకుబండి బరువేక్కుతుంది..!

image

‘కూటి కోసం కోటి తిప్పలు’ అన్నట్లు పట్టణాలకు వలస వచ్చిన పేదల బతుకు బండి బరువెక్కుతోంది. చిన్నాచితక పనిలో రూ.10-15 వేల అరకొర జీతంతో కుటుంబాన్ని ముందుకు నడుపుతున్న వేళ కూరగాయల, నిత్యావసరాల ధరలు పెరగటంతో పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చింది. మరోవైపు ఇంటి రెంట్, పిల్లల చదువులు, దవాఖాన ఖర్చులు ఇలా నెలాఖరుకు చేతిలో చిల్లిగవ్వ మిగలడంలేదని సగటు వ్యక్తి ఆవేదన.