News January 11, 2025

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్

image

TGలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. పెండింగ్ నిధులు పూర్తిస్థాయిలో చెల్లించేవరకు సేవలు అందించబోమని ప్రైవేట్ ఆసుపత్రులు తేల్చిచెప్పాయి. ఈ నిలిపివేత తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశాయి. 2 రోజుల క్రితం ప్రభుత్వం రూ.120 కోట్ల బకాయిలు రిలీజ్ చేసింది. దీంతో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని అంతా భావించారు. కానీ అన్ని బిల్లులను క్లియర్ చేయాలని నెట్‌వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి.

Similar News

News October 14, 2025

ఫిట్‌నెస్, ఫామ్‌ ఉంటేనే WC జట్టులో RO-KO: రవిశాస్త్రి

image

2027 WCలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడే అవకాశాలపై మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అది వారి హంగర్, ఫిట్‌నెస్, ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. AUSతో వన్డే సిరీస్ పూర్తయ్యేలోగా జట్టులో కొనసాగాలో వద్దో వారిద్దరికీ క్లారిటీ వస్తుంది. ఇప్పటికే గిల్, జైస్వాల్, తిలక్ లాంటి యంగ్ ప్లేయర్లు చాలా మంది సత్తా చాటుతున్నారు. కాబట్టి రోహిత్, కోహ్లీ రాణించాల్సిందే’ అని ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.

News October 14, 2025

వెంకటేశ్ మూవీ హిందీ రీమేక్‌లో అక్షయ్

image

వెంకటేశ్-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతోంది. అయితే ఈ మూవీని హిందీలో రీమేక్ చేయబోతున్నారు. అందులో తాను హీరోగా నటిస్తున్నట్లు అక్షయ్ కుమార్ వెల్లడించారు. ఈ చిత్రానికి అనీస్ బాజ్మీ దర్శకత్వం వహిస్తుండగా.. హీందీలోనూ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

News October 14, 2025

బ్రహ్మపుత్రపై రూ.6.4 లక్షల కోట్లతో ప్రాజెక్ట్

image

బ్రహ్మపుత్ర నదిపై రూ.6.4 లక్షల కోట్లతో హైడ్రో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. 2047కల్లా 76 గిగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిక్ కెపాసిటీతో ప్లాంట్ ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఈ ప్లాన్‌లో ఈశాన్య రాష్ట్రాల్లోని 12 సబ్ బేసిన్లలో 208 పెద్ద హైడ్రో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి ద్వారా 64.9GW పొటెన్షియల్ కెపాసిటీ, 11.1GW పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్స్ నుంచి జనరేట్ చేయొచ్చని పేర్కొంది.