News May 19, 2024
పోస్టింగ్ ఇప్పించాలని AB వెంకటేశ్వరరావు లేఖ

AP: కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ <<13207718>>తీర్పు<<>> ప్రకారం తనకు పోస్టింగ్ ఇప్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. తనకు పోస్టింగ్ ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని.. ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న తనకు న్యాయం చేయాలని కోరారు. తన సస్పెన్షన్ చెల్లదంటూ CAT ఇటీవల ఇచ్చిన తీర్పు కాపీని అందించారు. ఈ లేఖను CECకి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పంపారు.
Similar News
News January 24, 2026
నచ్చని తీర్పిస్తే జడ్జీని బదిలీ చేస్తారా: జస్టిస్ భూయాన్

GOVTకి నచ్చని తీర్పిచ్చారని జడ్జీనెందుకు బదిలీ చేయాలని జస్టిస్ భూయాన్(SC) ఓ వేదికపై ప్రశ్నించారు. అది జుడీషియరీపై ప్రభావం చూపదా అన్నారు. ఇది కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడమేనని స్పష్టం చేశారు. గత ఏడాది కల్నల్ సోఫియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన MP మంత్రికి HC జడ్జీ శ్రీధరన్ నోటీసులిచ్చారు. ఆ తర్వాత అలహాబాద్ బదులు ఆయన్ను ఛత్తీస్గఢ్కు బదిలీ చేశారు. దీనినే భూయాన్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
News January 24, 2026
Photo Gallery: విద్యార్థులతో సీఎం చంద్రబాబు

AP: ఇవాళ నగరి పర్యటనలో CM CBN కాసేపు విద్యార్థులతో గడిపారు. బాలురు, బాలికల పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టళ్లను సందర్శించారు. నెట్ జీరో కాన్సెప్ట్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాలు, నెట్ జీరో ఎలక్ట్రిసిటీలో భాగంగా స్కూలుపై ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్ టాప్, కంపోస్ట్ పిట్ను పరిశీలించి మాట్లాడారు. హాస్టల్ రూమ్స్, కిచెన్ రూమ్స్ తనిఖీ చేశారు.
News January 24, 2026
‘రథ సప్తమి’ ఎందుకు జరుపుకొంటారు?

సూర్యుడి గమనం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారే క్రమంలో మాఘ శుద్ధ సప్తమి నాడు ఆయన రథం ఉత్తర దిశగా ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అందుకే ఈ రోజును రథసప్తమి అంటారు. అలాగే సూర్యుడు 7 గుర్రాల రథంపై జగత్తుకు దర్శనమిచ్చింది కూడా ఈరోజే. నేటి నుంచి సూర్య కిరణాలు భూమికి దగ్గరగా వచ్చి ప్రాణికోటికి చైతన్యం, జఠరాగ్ని పెరుగుతాయని నమ్ముతారు. పాపాలను హరింపజేసే తిథి సూర్యారాధనకు అతి ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.


