News October 15, 2024

ABDUL KALAM: పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ దాకా

image

శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పుట్టినరోజు నేడు. పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ వరకు ఆయన జీవన ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన జన్మదినోత్సవాన్ని యూఎన్ఓ అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా ప్రకటించింది. భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న కూడా వరించింది. కలాం ఎప్పుడూ చెప్పే ‘కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి’ అనే సందేశం ప్రతి ఒక్కరిలో ఆలోచన రగిలిస్తుంది.

Similar News

News October 15, 2024

కొత్త టీచర్లకు నేడు పోస్టింగ్‌లు

image

TG: DSC ద్వారా టీచర్ పోస్టులకు ఎంపికైన వారికి విద్యాశాఖ ఇవాళ పోస్టింగ్‌లు ఇవ్వనుంది. ఇందుకోసం ఆయా జిల్లాల్లో స్పెషల్ కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. ఉ.9:30 నుంచి స్కూల్ అసిస్టెంట్, వ్యాయామ ఉపాధ్యాయులకు, మ.12.30 నుంచి SGTలకు కౌన్సెలింగ్‌ జరుగుతుంది. నేడు కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారికి మిగిలిపోయిన ఖాళీల్లో పోస్టింగ్‌లు ఇవ్వనుంది. మొత్తం 11,062 ఖాళీలుండగా 10,006 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది.

News October 15, 2024

పవన్ కళ్యాణ్ కామెంట్స్ తొలగించాలని పిల్

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని హైదరాబాద్ నాంపల్లి కోర్టులో పిల్ దాఖలైంది. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పంపిన తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వులు కలిశాయని వ్యాఖ్యానించారని, వాటిని సోషల్ మీడియా నుంచి తొలగించాలని లాయర్ రామారావు పిల్ వేశారు. మరోసారి పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గ్యాగ్ (నిషేధ) ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. నేడు ఈ పిల్ విచారణకు రానుంది.

News October 15, 2024

భూముల రీసర్వే.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

image

AP: భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబర్ 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలంది. భూసమస్యలపై ఈ గ్రామ సభల్లో వినతులు స్వీకరిస్తారు. రీ-సర్వేతో నష్టపోయిన రైతులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.