News October 26, 2024
ABHIMANYU: ఎన్నాళ్లో వేచిన ఉదయం..!

ఉత్తరాఖండ్ సీనియర్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ ఎట్టకేలకు టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఆయనను సెలక్ట్ చేశారు. 29 ఏళ్ల అభిమన్యు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అదరగొట్టారు. దులీప్ ట్రోఫీలో 2, ఇరానీ కప్లో 1, రంజీలో 1 చొప్పున వరుసగా 4 సెంచరీలు బాదారు. ఓవరాల్గా 12 వేలకుపైగా రన్స్ సాధించారు. ఇందులో 37 సెంచరీలు ఉన్నాయి. గతంలో స్టాండ్బైగా ఎంపికైనా జట్టులో చోటు దక్కించుకోలేదు.
Similar News
News December 1, 2025
లేటు వయసులో ప్రేమే స్ట్రాంగ్

35 ఏళ్ల తర్వాత జీవితంలోకి వచ్చే ప్రేమ, పెళ్లిలో బ్రేకప్లు, విడాకులు ఉండవని మహిళలు నమ్ముతున్నారని ‘సైకాలజీ టుడే’లో పబ్లిషైన ఒక అధ్యయనం పేర్కొంది. టీనేజ్ ప్రేమ, పెళ్లిళ్లలో ఆశలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామి సరిగా లేకపోయినా మార్చుకోవచ్చని భావిస్తారు. కానీ 35 తర్వాత ఒక వ్యక్తి వ్యక్తిత్వం భవిష్యత్తులో మారే అవకాశ తక్కువ. అలాగే ఆ వయసులో స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నట్లు ఆ అధ్యయనంలో తెలిపారు.
News December 1, 2025
13,217 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

IBPS రీజినల్ రూరల్ బ్యాంక్లో 13,217 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్/రూల్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 6, 7, 13, 14తేదీల్లో సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. వెబ్సైట్: https://www.ibps.in/
News December 1, 2025
మేడారం పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించండి: CM

TG: మేడారం అభివృద్ధి పనులు నిర్దేశిత సమయంలో పూర్తి కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అభివృద్ధి పనులపై ఆయన అధికారులతో సమీక్షించారు. ‘అభివృద్ధి పనుల్లో ఆచార సంప్రదాయాలు, నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. పొరపాట్లు దొర్లితే కఠిన చర్యలు తీసుకుంటాం. రాతి పనులు, రహదారులు, గద్దెల చుట్టూ రాకపోకలకు మార్గాలు, భక్తులు వేచి చూసే ప్రదేశాలు ఇలా ప్రతి అంశంపై CM అధికారులకు సూచనలు చేశారు.


