News November 25, 2024

ఐశ్వర్యపై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసిన అభిషేక్

image

త్వరలో విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తల నేపథ్యంలో భార్య ఐశ్వర్యరాయ్‌పై బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ‘నేను బయటకు వెళ్లి సినిమాలు చేయగలుగుతున్నా అంటే ఇంట్లో ఐశ్వర్య ఉందన్న ధైర్యమే. అందుకు నేను అదృష్టవంతుడిని. ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పిల్లలు కూడా తండ్రిని మూడో వ్యక్తిగా చూడరు. ఎందుకంటే వారికి పేరెంట్స్ ఇద్దరూ ఒక్కటే’ అని చెప్పారు.

Similar News

News December 5, 2025

కులాల కుంపట్లలో పార్టీలు.. యువతా మేలుకో!

image

తెలంగాణ పోరులో నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలకు పరిమితమైతే శ్రీకాంతాచారి సహా ఎంతో మంది సామాన్యులు ప్రాణత్యాగం చేశారు. ఇప్పుడు BC రిజర్వేషన్ల వ్యవహారంలో కులాల కుంపట్లను రాజేసి చలికాచుకునే పనిలో అన్నిపార్టీలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈశ్వరాచారి <<18478689>>ఆత్మహత్యే<<>> ఇందుకు నిదర్శనం. అవకాశవాద నాయకుల ఉచ్చులో పడకుండా యువత సంయమనం పాటించాలి. డిమాండ్ల సాధన కోసం పోరాటాలు చేయండి.. కానీ ప్రాణాలు తీసుకోవద్దు.

News December 5, 2025

₹72 వేలు చోరీ చేసిన వ్యక్తి TTDకి ₹14 కోట్లు ఎలా కట్టాడు జగన్?: పల్లా

image

AP: TTD పరకామణి చోరీపై YCP చీఫ్ జగన్ వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ‘చిన్న చోరీయే. పోయింది ₹72 వేలే’ అని అనడంపై TDP మండిపడుతోంది. ₹72 వేలు చోరీ చేసిన వ్యక్తి తిరిగి TTDకి ₹14CR ఎలా కట్టగలిగాడు? తీసుకోవడానికి సుబ్బారెడ్డి ఎవరు? దొంగిలించిన దానికి అదనంగా డబ్బిస్తే కేసు మాఫీ అవుతుందా? CBIకి ₹70 వేల కోట్లిస్తే మీ కేసులూ మాఫీ చేసేయొచ్చా జగన్!’ అని TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నించారు.

News December 5, 2025

నిరంతర ట్రాకింగ్‌కు కేంద్రం ప్రతిపాదనలు! వ్యతిరేకిస్తున్న సెల్ కంపెనీలు

image

శాటిలైట్ ఆధారిత లొకేషన్ ట్రాకింగ్‌ (A-GPS) సిస్టమ్‌ను యాక్టివ్‌లో ఉంచడాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. సెల్ టవర్ డేటా ఆధారంగా కేసులను దర్యాప్తు సంస్థలు విచారిస్తుంటాయి. దీనికి టెలికం సంస్థల డేటాపై ఆధారపడతాయి. కచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించాలంటే A-GPS తప్పనిసరి చేయాలని టెలికం సంస్థలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. అయితే ప్రైవసీకి భంగం కలుగుతుందని సెల్ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి.