News July 15, 2024
GPS రద్దు చేసి OPS అమలు చేయాలి: ఉద్యోగ సంఘాలు

AP: గత ప్రభుత్వం తీసుకొచ్చిన గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్(GPS)ను అమలు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు GPSను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్(OPS)ను తీసుకురావాలని SGTF, PRTU, UTF, సీపీఎస్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గెజిట్ పత్రాలను దహనం చేశాయి. ఈ నెల 16, 17 తేదీల్లో నిరసనలు చేపట్టనున్నట్లు APTF వెల్లడించింది.
Similar News
News December 17, 2025
నేడు, రేపు కలెక్టర్ల సదస్సు

AP: రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో బుధవారం 10AMకు 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభం కానుంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించుకొని లక్ష్యాలకు అనుగుణంగా పని చేసేలా 2 రోజుల కాన్ఫరెన్స్ జరగనుంది. తొలి రోజు 18నెలల పాలనపై సమీక్ష చేసుకొని కలెక్టర్లకు CM దిశానిర్దేశం చేయనున్నారు. 2వ రోజు జిల్లాల్లో ఉత్తమ పద్ధతులు అవలంభించిన కలెక్టర్ల ప్రజెంటేషన్లు, తదితర ప్రోగ్రాంలు ఉండనున్నాయి.
News December 17, 2025
పృథ్వీ షా SAD పోస్ట్.. అంతలోనే!

IPL మినీ వేలంలో తొలిసారి పృథ్వీ షా పేరు రాగానే కొనడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. దీంతో ఆయన it’s ok అని హార్ట్ బ్రేక్ సింబల్ను ఇన్స్టా స్టోరీగా పెట్టారు. కాసేపటికే 2వ రౌండ్లో DC రూ.75 లక్షలకు కొనుగోలు చేయగా దాన్ని డిలీట్ చేసి ‘BACK TO MY FAMILY’ అని పోస్ట్ చేశారు. గతంలో 7 సీజన్లు DCకి ఆడిన షా 79 మ్యాచుల్లో 1,892 రన్స్ చేశారు. 2025 మెగా వేలం ముందు DC ఆయన్ను వదులుకోగా ఏ జట్టూ కొనలేదు.
News December 17, 2025
కేంద్ర సాయుధ బలగాల్లో 438 ఆత్మహత్యలు

కేంద్ర సాయుధ బలగాలు (CAPFs), అస్సాం రైఫిల్స్, NSGలో 2023-25 మధ్య 438మంది సైనికులు సూసైడ్ చేసుకున్నారని కేంద్రం లోక్సభలో తెలిపింది. అత్యధికంగా CRPFలో 159ఆత్మహత్యలు నమోదైనట్లు చెప్పింది. అటు 2014-2025 మధ్య CAPF, అస్సాం రైఫిల్స్లో 23,360మంది ఉద్యోగానికి రాజీనామా చేశారని, ఇందులో BSFలో ఎక్కువ మంది 7,493మంది ఉన్నారంది. ఈ ఏడాది 3,077మంది రిజైన్ చేయగా వారిలో 1,157మంది BSF సైనికులున్నట్లు చెప్పింది.


