News November 29, 2024
టెన్త్ విద్యార్థులకు గ్రేడింగ్ విధానం తొలగింపు

TG: టెన్త్ పరీక్షల్లో <<14735937>>ఇంటర్నల్ మార్కులను<<>> తొలగించిన విద్యాశాఖ గ్రేడింగ్ విధానాన్నీ తొలగించాలని నిర్ణయించింది. ఏ1, ఏ2, బి1, బి2 గ్రేడులకు బదులు మార్కులను ప్రకటించనుంది. అలాగే ఆన్సర్ షీట్లలో కూడా మార్పులు చేసింది. 4 పేజీల బుక్ లెట్+అడిషనల్ పేపర్లకు బదులు 24 పేజీల ఆన్సర్ బుక్ లెట్లను ఇవ్వనుంది. సైన్స్ పేపర్లకు ఒక్కో దానికి 12 పేజీల ఆన్సర్ బుక్ లెట్ ఇవ్వాలని నిర్ణయించింది.
Similar News
News October 17, 2025
పిల్లలను స్కూల్కు పంపేందుకు ఇంత కష్టపడుతున్నారా?

పిల్లలను తయారుచేసి బడికి పంపే సమయంలో మనం చేసే హడావిడి.. మారథాన్లో పరిగెత్తడానికి సమానం అని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రక్రియలో తల్లిదండ్రులు 3,000 క్యాలరీల వరకు ఖర్చు చేస్తారని అంచనా వేశారు. పిల్లలను బట్టలు వేసుకోమని బతిమాలడం, అరవడంలో తల్లిదండ్రులు ఖర్చుచేసే శక్తి ‘మారథాన్లో పరుగెత్తడం, కోపంగా ఉన్న ఎలుగుబంటితో పోరాడినంత పనే’ అని ప్రొఫెసర్ ఓలాన్ విచ్ వివరించారు. మీరూ ఇలా కష్టపడతారా?
News October 17, 2025
వాస్తు నియమాలు పాటిస్తే అనుకున్నది జరుగుతుందా?

వాస్తు నియమాలు పాటించినంత మాత్రాన అనుకున్నది జరిగిపోదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలిపారు. కల సాకారం కావాలంటే కృషి, పట్టుదల, సరైన ప్రణాళిక కూడా ఉండాలన్నారు. ‘వాస్తు చుట్టూరా వాతావరణాన్ని మనకు సానుకూలంగా మలచి, ఉత్సాహంగా, ఏకాగ్రతతో పనిచేసేలా చేస్తుంది. శ్రమకు, వాస్తు తోడైతే సఫలీకృత ప్రయత్నాలు తప్పక విజయవంతం అవుతాయని వాస్తు శాస్త్రం బోధిస్తోంది’ అని ఆయన వివరించారు. <<-se>>#Vasthu<<>>
News October 17, 2025
లోకేశ్ ట్వీట్కు కౌంటరిచ్చిన సిద్దరామయ్య

APలో పెట్టుబడులపై మంత్రి లోకేశ్ చేసిన <<18020050>>ట్వీట్<<>> తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. తాజాగా కర్ణాటక CM సిద్దరామయ్య కౌంటరిచ్చారు. ‘ఇన్వెస్టర్లు తమకు నచ్చిన చోట పెట్టుబడులు పెడతారు. యాపిల్ సంస్థ కర్ణాటకలో ఇన్వెస్ట్ చేసింది.. ఆంధ్రప్రదేశ్లో కాదు’ అని వ్యాఖ్యానించారు. అంతకుముందు లోకేశ్ను ఎద్దేవా చేస్తూ కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేతో పాటు KN, TN నెటిజన్లు <<18027162>>ట్వీట్లు<<>> చేశారు.