News August 28, 2024
ఎక్సైజ్ శాఖలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దు: మంత్రి

AP: ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2019-24 మధ్య ఉన్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దు చేస్తున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు. 2014కు ముందు ఉన్న విధానాన్ని పునరుద్ధరిస్తామన్నారు. గత ప్రభుత్వంలో నాణ్యమైన మద్యం లేకపోవడంతో గంజాయి వాడకం పెరిగిందని, ఆదాయం కూడా తగ్గిందని తెలిపారు. వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు ఆమోదం తెలిపామని చెప్పారు.
Similar News
News February 2, 2026
BIG NEWS: మోదీతో ట్రంప్ చర్చలు

కొన్ని నెలలుగా భారత్-అమెరికా మధ్య సందిగ్ధంలో ఉన్న ట్రేడ్ చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. PM మోదీతో US అధ్యక్షుడు ట్రంప్ ఫోన్లో మాట్లాడినట్లు భారత్లోని US రాయబారి సెర్జియో గోర్ Xలో వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం ఎదురుచూడండని రాసుకొచ్చారు. దీంతో సుంకాలు, H1B వీసాలపై కీలక ప్రకటన వెలువడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఇండియా గేట్ ఫొటోతో ట్రంప్ హింట్ <<19033803>>ఇచ్చారంటున్నారు.<<>>
News February 2, 2026
లేట్ నైట్ నిద్రపోతున్నారా? బీ కేర్ఫుల్..

‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ తాజా స్టడీ ప్రకారం.. రాత్రిపూట ఆలస్యంగా పడుకునే వారిలో హార్ట్ అటాక్, స్ట్రోక్ ముప్పు చాలా ఎక్కువగా ఉంది. బాడీ క్లాక్ దెబ్బతినడమే దీనికి ప్రధాన కారణం. వీరికి గుండె జబ్బుల రిస్క్ ఇతరుల కంటే 16% ఎక్కువగా ఉంటోంది. సరైన నిద్ర, వ్యాయామం లేకపోవడం, స్మోకింగ్ అలవాటు కారణంగా ఈ ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
News February 2, 2026
ఇండియా గేట్ ఫొటో షేర్ చేసిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ లక్ష్యంగా ఆసక్తికర పోస్టు చేశారు. ఢిల్లీలోని ఇండియా గేట్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఇది అందమైన విజయోత్సవ తోరణం. USలో ఇంతకంటే గొప్ప కట్టడం నిర్మిస్తాం’ అని రాసుకొచ్చారు. అలాగే న్యూస్ మేకర్స్ ఆఫ్-2025 పేరుతో ‘ఇండియా టుడే’ రిలీజ్ చేసిన మ్యాగజైన్ కవర్ పేజీ పోస్టర్నూ షేర్ చేశారు. INDతో ట్రేడ్ డీల్ సానుకూలంగా జరుగుతోందన్న సంకేతాలను ట్రంప్ ఇచ్చారని నిపుణులు భావిస్తున్నారు.


