News November 24, 2024
జగన్ క్విడ్ ప్రోకోపై ఏసీబీ విచారణ: అయ్యన్న

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఆయన అవినీతిపై CBI, ACB విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘అదానీతో కాకుండా సెకీతో ఒప్పందం చేసుకున్నామని YCP ప్రకటించింది. కానీ సెకీ నోడల్ ఏజెన్సీ మాత్రమే. అదానీ కేసుతో సెకీకి సంబంధం లేదు. జగన్ క్విడ్ ప్రోకోతో రాష్ట్రానికి తీవ్ర నష్టం చేకూరింది. ప్రజలపై అధిక విద్యుత్ ఛార్జీల భారం పడింది’ అని ఆయన మండిపడ్డారు.
Similar News
News October 27, 2025
పత్తి తేమ 12% దాటితే మద్దతు ధర రాకపోవచ్చు: తుమ్మల

TG: పత్తి అమ్మకాల విషయంలో రైతులు నాణ్యత, తేమ శాతాన్ని దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పత్తి తేమ 12% మించకుండా చూసుకోవాలన్నారు. 12శాతం మించితే కనీస మద్దతు ధర పొందే అవకాశం ఉండదని తెలిపారు. గరిష్ఠ మద్దతు ధర అందించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ విషయమై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు.
News October 27, 2025
భారత్తో టెస్ట్ సిరీస్.. SA జట్టు ప్రకటన

వచ్చే నెలలో భారత్తో జరగనున్న రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్కు 15 మంది కూడిన జట్టును SA ప్రకటించింది. కెప్టెన్గా టెంబా బవుమా వ్యవహరించనున్నారు. మార్క్రమ్, బాష్, బ్రెవిస్, టోనీ, రికెల్టన్, స్టబ్స్, వెరైన్, హమ్జా, హార్మర్, కేశవ్ మహరాజ్, ముత్తుస్వామి, ముల్డర్, జాన్సన్, రబాడ ఎంపికయ్యారు. నవంబర్ 14న తొలి టెస్టు కోల్కతాలో, రెండోది 22న గువాహటిలో జరుగుతాయి.
News October 27, 2025
పత్తిలో తేమ శాతం పెరిగితే మద్దతు ధర కష్టం: మంత్రి తుమ్మల

TG: పత్తి రైతులకు గరిష్ఠ మద్దతు ధర అందించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పత్తి అమ్మకాల విషయంలో రైతులు CCI ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యత, తేమను దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి సూచించారు. పత్తిలో తేమ 12 శాతానికి మించకుండా చూసుకోవాలని.. 12 శాతానికి మించి తేమ ఉంటే కనీస మద్దతు ధర పొందడం కష్టమన్నారు. దీనికి అనుగుణంగా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


