News November 30, 2024

ఉద్యోగిపై ACB రైడ్స్.. రూ.150 కోట్ల ఆస్తులు

image

TG: నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ ఇంట్లో ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్న ACB భారీగా ఆస్తులు గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 ప్రాంతాల్లో నిఖేశ్ నివాసంతో పాటు బంధువుల ఇళ్లల్లో సోదాలు చేసి రూ.150 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించింది. రూ.లక్ష లంచం తీసుకుంటూ పది నెలల క్రితం ఆయన పట్టుబడగా, ఆయనపై ACB ఫోకస్ పెట్టింది. ఆయన పేరిట 3 విల్లాలు, 3 ఫామ్‌హౌస్‌లు ఉన్నట్లు ACB గుర్తించింది.

Similar News

News March 31, 2026

ఏఐ డేటా సెంటర్.. 2 డిగ్రీలు పెరగనున్న హీట్?

image

ఏఐ డేటా సెంటర్ల వల్ల అభివృద్ధితోపాటు ఉష్ణోగ్రతా పెరుగుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ‘డేటా సెంటర్‌కు భారీగా వాటర్, ఎలక్ట్రిసిటీ అవసరం. అలాగే ఆ కేంద్రం వల్ల 9.9KM విస్తీర్ణంలో హీట్ 2 డిగ్రీల వరకు అధికమవుతుంది. కొన్ని సందర్భాల్లో 9 డిగ్రీల వరకు పెరగవచ్చు. తద్వారా 34 కోట్ల మందిపై ప్రభావం పడొచ్చు. దీన్నే డేటా హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటాం’ అని నిపుణులు తెలిపారు. కాగా ఆ స్టడీపై రివ్యూ జరగాల్సి ఉంది.

News March 31, 2026

సెక్స్ కోసం భార్యను బలవంతం చేయడం రేపే: చిన్మయి

image

‘చిరైయా’ సిరీస్‌లో భార్యకు ఇష్టం లేకుండా భర్త శృంగారం చేసే సీన్‌పై సింగర్ చిన్మయి ఘాటుగా స్పందించారు. ‘పెళ్లయినంత మాత్రాన ఎదుటివారికి ఇష్టం లేకపోయినా ముహూర్తం పేరుతో శృంగారానికి బలవంతం చేయడం తప్పు. ఇది రేప్ కిందకే వస్తుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో భర్త గురించి తెలుసుకునే సమయం కూడా దొరకదు’ అని Xలో రాసుకొచ్చారు. దంపతుల మధ్య గౌరవం, ఇష్టం ఉన్నప్పుడే ఆ బంధం కలకాలం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

News March 31, 2026

IPL బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్ మృతి

image

ENGకు చెందిన IPL బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్‌ జాన్ విలియమ్(76) మరణించారు. ఈ నెల 29న MI-KKR మ్యాచ్‌ తర్వాత హోటల్‌కు వెళ్లారు. మరుసటి రోజు కాల్ చేసినా స్పందించకపోవడంతో సిబ్బంది మాస్టర్ కీతో డోర్ తెరిచి చూడగా జాన్ నేలపై పడిఉన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టంలో అనుమానాస్పదంగా ఏమీ లేనప్పటికీ అసహజ మరణంగానే కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు.