News March 17, 2024

HYD నుంచి మెదక్‌ వెళ్తుంటే యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌ వాసి మృతి చెందాడు. నగరం నుంచి మెదక్ వైపు వెళ్తుండగా కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో HYD వాసి హబీబ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 29, 2024

ఓయూ: 30న PDSU స్వర్ణోత్సవాల మహాసభ

image

PDSU స్వర్ణోత్సవాల మహా సభను ఈ నెల 30న ఓయూలో నిర్వహించనున్నారు. ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో స్వర్ణోత్సవాలను నిర్వహిస్తున్నట్లు PDSU రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, ఆజాద్ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వర్ణోత్సవ మహాసభలకు ముఖ్య వక్తలుగా ముంబై హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ జీబీ కోల్సేపాటిల్ హాజరవుతారని పేర్కొన్నారు.

News September 29, 2024

VIRAL: హైదరాబాద్‌లో సరస్సులు.. ఎంత బాగుండేనో..!

image

HYDRAA కూల్చివేతలు కొనసాగుతున్న నేపథ్యంలో 1879లో రూపొందించిన హైదరాబాద్ సరస్సుల చారిత్రక చిత్రాలు వైరల్ అయ్యాయి. పరిశోధకుడు అసిఫ్ అలీ ఖాన్ ఈ చిత్రాలను పంచుకుని నగరానికి చెందిన పూర్వ చరిత్రను వెలుగులోకి తెచ్చారు. హుస్సేన్ సాగర్, మిర్ ఆలమ్ ట్యాంక్, సరూర్ నగర్ సరస్సులపై ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కలుషితమైన ఈ సరస్సులను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.

News September 29, 2024

అక్టోబర్ 1 నుంచి ఓయూ పీజీ పరీక్షలు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్షలను వచ్చే నెల 1 నుంచి నిర్వహించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంకామ్ (ఐఎస్), ఎంఎస్ డబ్ల్యూ, ఎంలిబ్ఎస్సీ, ఎంజేఅండ్ఎంసీ తదితర కోర్సుల మొదటి, మూడో సెమిస్టర్ బ్యాక్ లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షలను 1వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు వివరించారు.