News March 17, 2024
HYD నుంచి మెదక్ వెళ్తుంటే యాక్సిడెంట్.. ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. నగరం నుంచి మెదక్ వైపు వెళ్తుండగా కొల్చారం మండలం కిష్టాపూర్ గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో HYD వాసి హబీబ్ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News August 20, 2025
కొందుర్గు: కలెక్టర్కు లేఖ రాసిన విద్యార్థులు

కొందుర్గు మండలం చెరుకుపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు జిల్లా కలెక్టర్, డీఈఓకు లేఖ రాశారు. తమ పాఠశాలలో పనిచేస్తున్న సుష్మ అనే టీచర్ గండిపేట పాఠశాలకు డిప్యూటేషన్పై వెళ్లారని, దీంతో తమ పాఠశాలలో శివారెడ్డి అనే టీచర్ ఒకరే ఉండడంతో చదువు బోధించడం ఇబ్బందిగా మారిందని, వెంటనే సుష్మ టీచర్ను తమ పాఠశాలకు పంపించాలని విద్యార్థులు కోరారు.
News August 19, 2025
4,600 పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి: రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్

రంగారెడ్డి జిల్లాకు కొత్తగా వచ్చిన అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డిని భూమికి సంబంధించిన ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయంటూ బాధితులు వచ్చి కలుస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అడిషనల్ కలెక్టర్ ఆఫీస్ గోడపై బోర్డులు ఏర్పాటు చేశారు. ‘నా వద్ద 4,600 పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి.. వీటిని క్లియర్ చేయడానికి నాకు సమయం పడుతుంది.. దయచేసి సహకరించండి’ అంటూ ఇలా నోటీస్ అంటించి బాధితులని కోరుతున్నారు.
News August 19, 2025
HYD- తిరుపతి విమానంలో సాంకేతిక లోపం

శంషాబాద్ ఎయిర్ పోర్టులో HYD- తిరుపతి అలియాన్స్ ఎయిర్లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. 67 మంది ప్రయాణికులు బోర్డింగ్ అయిన తర్వాత సాంకేతిక లోపాన్నీ పైలెట్ గుర్తించారు. తిరిగి ప్రయాణికులను దింపేసి సాంకేతిక లోపాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు. కాగా.. తిరుపతి వెళ్లాల్సిన 67 మంది ప్రయాణికులు హోల్డింగ్లొనే ఉన్నారు.