News March 6, 2025
CM స్టాలిన్ టార్గెట్ ప్రకారం తమిళులు ఏడాదికి ఇద్దర్ని మించి కనాలి!

ప్రజలు తక్షణమే పిల్లల్ని కనాలన్న TN CM స్టాలిన్ టార్గెట్ ఈజీ కాదని డేటా చెబుతోంది. దేశ జనాభాలో TN వాటా 5.2%. నిజానికి అక్కడ 7.18%కు సమానమైన 39 LS సీట్లు ఉన్నాయి. ఒకవేళ 2026 జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ చేస్తే అదనంగా కోటిమంది కావాలి. ఇప్పుడున్న 1.52 TFR (ఫెర్టిలిటీ రేటు)తో 77లక్షల జననాలే సాధ్యం. మిగిలిన 23లక్షల మందిని కనాలంటే 3.23 TFR అవసరం. అంటే 15-45 ఏళ్ల గృహిణులు ఏడాదిలో ఇద్దర్ని మించి కనాలి.
Similar News
News January 3, 2026
పాపం చిలుకలు.. ప్రేమగా వేసిన గింజలు తిని!

చూడముచ్చటైన చిలుకల కిలకిలరావాలతో అలరారే నర్మదా తీరం నేడు మూగబోయింది. MPలోని ఖర్గోన్లో 200కు పైగా చిలుకలు, పావురాలు విగతజీవులుగా మారాయి. విషపూరిత ఆహారం వల్లే ఈ ఘోరం జరిగినట్లు పోస్ట్మార్టంలో తేలింది. పర్యాటకులు వేసిన కలుషిత అన్నం లేదా విషం కలిపిన గింజల వల్లే అవి మరణించాయని తెలిసి పర్యావరణ ప్రేమికులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషయం తెలిసి గుండె పగిలిపోయిందంటూ SMలో పోస్టులు పెడుతున్నారు.
News January 3, 2026
సభకు రాని వ్యక్తి అజెండా డిసైడ్ చేస్తున్నారు: అక్బరుద్దీన్

TG: సభకు రాని వ్యక్తి సభ అజెండా డిసైడ్ చేస్తున్నారంటూ KCRను ఉద్దేశిస్తూ అసెంబ్లీలో MIM MLA అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. ఆయన ఇరిగేషన్పై చర్చిస్తానని చెప్పారని, కానీ ఇప్పుడు BRS ఎమ్మెల్యేలెవరూ సభలో లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. ఇక 2,3 రోజుల నుంచి అసెంబ్లీలో కృష్ణా, గోదావరి తప్ప వేరే అంశాలపై చర్చించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇతర సమస్యలపైనా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
News January 3, 2026
KCR అస్త్రాన్నే ఆయుధంగా మలుచుకుంటున్న రేవంత్!

TG: పాలమూరు ప్రాజెక్టు అస్త్రంగా GOVT, INCపై పోరాటం చేపట్టి ప్రజల్లోకి దూసుకెళ్లాలని BRS చీఫ్ KCR భావించారు. అందుకు తగ్గట్టు ఆ ప్రాంతంలో 3 సభలకూ నిర్ణయించారు. అయితే ఆ ప్రాజెక్టు సోర్సును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వెనుక అవినీతి జరిగిందని ఆరోపించిన CM దానిపై SIT ఏర్పాటుకు రెడీ అవుతున్నారు. దీంతో KCR వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు ఆయన ప్రయోగించిన అస్త్రాన్నే రేవంత్ ఆయుధంగా మలుచుకున్నట్లవుతోంది.


