News December 23, 2024
సన్నీలియోన్ పేరిట అకౌంట్.. నెలకు రూ.1000

నటి సన్నీలియోన్ పేరిట అకౌంట్ క్రియేట్ చేసిన ప్రబుద్ధుడు నెలనెలా రూ.1000 పొందుతున్నాడు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పెళ్లైన మహిళలకు ‘మహతారి వందన్ యోజన’ పేరుతో ప్రతి నెలా అకౌంట్లో రూ.వెయ్యి జమ చేస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న వీరేందర్ జోషి ఫేక్ ఖాతాతో మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అకౌంట్ సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ పథకంలో 50% ఫేక్ అకౌంట్లు ఉన్నాయని BJP సర్కారుపై కాంగ్రెస్ విమర్శించింది.
Similar News
News November 20, 2025
ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ను కలిసిన కేయూ JAC

కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్గా పి.భాస్కర్ నూతనంగా నియామకమయ్యారు. ఈ సందర్బంగా కేయూ జేఏసీ నాయకులు గురువారం ఆయనను కలిశారు. ప్రిన్సిపల్ను శాలువాతో సన్మానించి, పూలమొక్క అందచేసి, శుభాకాంక్షలు తెలిపారు. డిపార్ట్మెంట్ అభివృద్ధి కోసం పనిచేయాలని, ఉన్నత శిఖరాలకు ఎదిగేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని వారు ప్రిన్సిపల్ను కోరారు.
News November 20, 2025
అందుకే రూపాయి పతనమైంది: RBI గవర్నర్

డాలర్కు డిమాండ్ పెరగడం వలనే రూపాయి పతనమైందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. రూపాయి విలువను నిర్దిష్టంగా లెక్కించడం లేదని స్పష్టం చేశారు. అమెరికన్ కరెన్సీకి విలువ పెరగడం వల్లే రూపాయి విలువ తగ్గిందన్నారు. మార్కెట్ ఎలా జరుగుతోంది అనే దానిపైనే రూపాయి విలువ ఆధారపడి ఉంటుందని చెప్పారు. డాలర్కు డిమాండ్ పెరిగితే రూపాయి విలువ తగ్గినట్టే, రూపాయి డిమాండ్ పెరిగితే డాలర్ పతనమవుతుందని తెలిపారు.
News November 20, 2025
ఓట్ చోర్, SIRపై సందేహాలను నివృత్తి చేయాలి: మాజీ సీఈసీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ఓట్ చోర్, SIR ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్పై ఉందని మాజీ సీఈసీ ఖురేషి తెలిపారు. ఆరోపణలపై పూర్తి స్థాయిలో నివృత్తి చేసి ప్రజాస్వామ్యంపై ఉన్న విశ్వాసాన్ని కాపాడాలని కోరారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని, ప్రత్యారోపణలు చేయడం సరైనది కాదని ఓ పాడ్కాస్ట్లో అన్నారు. 2010-12 మధ్య ఖురేషీ సీఈసీగా పని చేశారు.


