News December 25, 2024
అక్రిడేషన్ గడువు మరో 3 నెలలు పొడిగింపు

TG: రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువును మరో 3 నెలల పాటు పొడిగిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ ఉత్తర్వులిచ్చింది. డిసెంబర్ 31వ తేదీతో గడువు ముగియనుండగా, జనవరి 1 నుంచి మార్చి 31వ తేదీ వరకు అక్రిడేషన్లు పనిచేస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్టీసీ సంస్థకు అధికారులు తెలియజేశారు.
Similar News
News December 28, 2025
కర్ణాటక రాజకీయాల్లో KC చిచ్చు.. BJP ఫైర్

బెంగళూరులో అక్రమ కట్టడాల కూల్చివేత కర్ణాటకలో రాజకీయ దుమారం రేపింది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నేత KC వేణుగోపాల్ జోక్యం చేసుకోవడంపై BJP మండిపడింది. ఆయన్ను ‘సూపర్ CM’గా అభివర్ణిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఢిల్లీ ఆదేశాలతో నడుస్తోందని విమర్శించింది. రాష్ట్ర పాలనలో జోక్యం చేసుకోవడం సమాఖ్య వ్యవస్థను అవమానించడమేనని ప్రతిపక్ష నేత అశోక ధ్వజమెత్తారు.
News December 28, 2025
Op సిందూర్ టైమ్లో బంకర్లోకి వెళ్లమన్నారు: పాక్ అధ్యక్షుడు

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో పాక్ అగ్రనాయకత్వం భయాందోళనకు గురైందని అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అంగీకరించారు. ఆ సమయంలో ప్రాణరక్షణ కోసం బంకర్లోకి వెళ్లాలని సైనిక కార్యదర్శి తనకు సూచించారని వెల్లడించారు. అందుకు తాను నిరాకరించినట్లు తెలిపారు. కాగా భారత క్షిపణుల ధాటికి పాక్ బెంబేలెత్తిపోయిందనే విషయం దీని ద్వారా స్పష్టమైంది.
News December 28, 2025
50 మందికి పైగా దుర్మరణం.. సిగాచీ CEO అరెస్ట్

TG: సిగాచీ కంపెనీ CEO అమిత్రాజ్ను పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జూన్లో సంగారెడ్డి(D) పాశమైలారంలోని సిగాచీ కంపెనీలో భారీ పేలుడు సంభవించి 50 మందికి పైగా కార్మికులు మరణించారు. దీంతో ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా నిన్న రాత్రి CEOను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అటు బాధితులకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని యాజమాన్యాన్ని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది.


