News August 22, 2024
అచ్యుతాపురం సెజ్ ఘటన.. బాధ్యులను శిక్షిస్తాం: సీఎం చంద్రబాబు

AP: అచ్యుతాపురం సెజ్ ఘటనపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. కమిటీ నివేదిక వచ్చాక ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ‘ఎసెన్షియా కంపెనీ రెడ్ కేటగిరిలో ఉంది. బాధితులకు కంపెనీయే పరిహారం చెల్లిస్తుంది. నిబంధనలు పాటించకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. విశాఖలో గత 5 ఏళ్లలో 119 ప్రమాదాలు జరగగా, 120 మంది చనిపోయారు’ అని వెల్లడించారు.
Similar News
News July 11, 2025
డేటా అవసరం లేని వారికోసం Airtel కొత్త ప్లాన్

ఎయిర్టెల్ సంస్థ కస్టమర్స్ కోసం కొత్తగా రూ.189 ప్లాన్ తీసుకొచ్చినట్లు ప్రకటించింది. డేటా కోసం కాకుండా నంబరును యాక్టివ్గా ఉంచాలనుకునే వారికి, ఇంటర్నెట్ పెద్దగా వాడని పేరెంట్స్కి ఈ ప్లాన్ యూజ్ అవుతుంది. ఈ ప్లాన్ 21 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అన్ని నెట్వర్కులకు అపరిమిత వాయిస్ కాల్స్, 1GB మొబైల్ డేటా, 300 SMSలు వస్తాయి. అయితే ఇది డేటా ఎక్కువగా వాడే వారికి అంత ఉపయోగంగా ఉండదు.
News July 11, 2025
అరుదైన ఘనత.. వరుస ఓవర్లలో 2 హ్యాట్రిక్స్

ENG సఫోల్క్ కౌంటీకి చెందిన కిశోర్ కుమార్ సాధక్ అనే 37 ఏళ్ల స్పిన్నర్ రేర్ ఫీట్ సాధించారు. UKలోనీ టూ కౌంటీస్ ఛాంపియన్షిప్లో కెస్గ్రేవ్తో జరిగిన డివిజన్ మ్యాచ్లో వరుసగా 2ఓవర్లలో 2హ్యాట్రిక్స్ నమోదు చేశారు. ఇప్స్విచ్ & కోల్చెస్టర్ తరఫున బరిలోకి దిగిన సాధక్ 6 ఓవర్లేసి 20 రన్స్ ఇచ్చి ఆరుగురిని అవుట్ చేశారు. వారిలో ఐదుగురు డకౌట్ కావడం విశేషం. ఈ మ్యాచ్లో సాధక్ జట్టు 7వికెట్ల తేడాతో గెలిచింది.
News July 11, 2025
రష్మిక విలన్ రోల్ చేస్తోందా?

అల్లు అర్జున్-అట్లీ మూవీలో రష్మిక నటిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో ఐదుగురు హీరోయిన్లని, అందులో రష్మిక ఒకరని సినీటౌన్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే దీపికను హీరోయిన్గా పరిచయం చేశారు. మృణాల్ కూడా షూటింగ్లో పాల్గొన్నారని చెబుతున్నారు. మిగిలిన 3 పాత్రల్లో రష్మిక, జాన్వీ, భాగ్యశ్రీ పేర్లు వినిపిస్తున్నాయి. రష్మిక పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని, యాక్షన్ సీన్సూ చేస్తారని సమాచారం.